నమాజ్ చేస్తున్న వారిపై దుండగుల దాడి.. మసీదును ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత.. ఎక్కడంటే ?
హర్యానాలో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 15-20 మంది దుండగులు ఆయుధాలు తీసుకొని ఓ మసీదును ధ్వంసం చేశారు. అలాగే నమాజ్ చేస్తున్న వారిపై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హర్యానాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోనిపట్ లో ఆదివారం అర్థరాత్రి కొందరు దుండగులు ఆయుధాలు పట్టుకొని ఓ మసీదును ధ్వంసం చేశారు. అలాగే నమాజ్ చేస్తున్న వారిపై దాడి చేశారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. దీంతో ఆ ప్రాంతంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ ఘటన సోనిపట్ లోని శాండల్ కలాన్ గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రతిపక్షాలపై శరద్ పవార్ ఫైర్.. డిగ్రీ అంశం తప్ప దేశంలో ముఖ్యమైన సమస్యలేమీ లేవా అంటూ కామెంట్స్..
సుమారు 15-20 మంది వ్యక్తులు చేతిలో కర్రలతో మసీదులోకి చొరబడి మసీదును ధ్వంసం చేశారు. ఈ దాడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఈ ఫొటోల్లో దుండగులు చేతిలో వెదురు కర్రలు పట్టుకుని నిర్భయంగా తిరుగుతున్నారు. ఈ దాడికి పాల్పడిన కూడా ఘటన జరిగిన అదే గ్రామానికి చెందినవారు.
ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలు. దీంతో వారిని సోనిపట్ సివిల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు బలగాలను గ్రామంలో మోహరించారు. కాగా.. ఈ ఘటనకు కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.