Asianet News TeluguAsianet News Telugu

అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

గత కొద్దిరోజులుగా అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. దీంతో.. ప్రజు భయంతో వణికిపోయారు.
 

Three Earthquakes Hit Arunachal Pradesh, Tremors Felt In Assam
Author
Hyderabad, First Published Jul 20, 2019, 7:28 AM IST

అరుణాచల్ ప్రదేశ్ లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. గత కొద్దిరోజులుగా అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. దీంతో.. ప్రజు భయంతో వణికిపోయారు.

అరుణాచల్ ప్రదేశ్  రాష్ట్రంలోని ఈస్ట్ కామెంగ్ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం బొందిలకు ఈశాన్యంలో 64కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios