New Delhi: ఫిబ్రవరి 14న 'కౌ హగ్ డే' ప్రకటనపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంది. అయితే, వాలెంటైన్స్ డే నాడు ఆవును కౌగిలించుకోవడం వల్ల అది భావోద్వేగ సంపదను తెస్తుందనీ, వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుందని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తన సలహాను సమర్థించుకుంది.
No 'Cow Hug Day' On February 14: ఫిబ్రవరి 14న 'కౌ హగ్ డే' ప్రకటనపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తన విజ్ఞప్తిని ఉపసంహరించుకుంది. అయితే, వాలెంటైన్స్ డే నాడు ఆవును కౌగిలించుకోవడం వల్ల అది భావోద్వేగ సంపదను తెస్తుందనీ, వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుందని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తన సలహాను సమర్థించుకుంది.
వివరాల్లోకెళ్తే.. వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు-ఫిబ్రవరి 14) రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వ సంస్థ విజ్ఞప్తిని సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉపసంహరించుకున్నారు. వాలెంటైన్స్ డే రోజున ఆవును కౌగిలించుకోవడం వల్ల అది భావోద్వేగ సంపదను తెస్తుందనీ, వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుందని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తన సలహాను సమర్థించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన పురుషోత్తం రూపాల నేతృత్వంలోని పశుసంవర్ధక శాఖ పరిధిలోకి యానిమల్ వెల్ఫేర్ బోర్డు తన ప్రకటనపై వెనక్కి తగ్గింది. ఫిషరీస్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న ఆవు కౌగిలింత దినోత్సవం ( కౌ హగ్ డే)నిర్వహించాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అప్పీలును ఉపసంహరించుకుంటున్నట్లు బోర్డు కార్యదర్శి ఎస్కే దత్తా ఒక ప్రకటనలో తెలిపారు.
'మోరల్ పోలీసులు' చెడు పాశ్చాత్య పద్దతి అని పిలిచే వాలెంటైన్స్ డేను జరుపుకునే భారతదేశంలోని జంటలు ప్రతి సంవత్సరం శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నాయని హక్కుల కార్యకర్తలు అంటున్నారు. భారతదేశంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలెంటైన్స్ డే రోజున జంటలను పురుషుల గుంపులు కొట్టడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని అనేక డిమాండ్లు ఉన్న పెద్దగా మార్పు లేదు. పాశ్చాత్య సంస్కృతి పురోగతి కారణంగా వైదిక సంప్రదాయాలు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయనీ, పాశ్చాత్య నాగరికత మన భౌతిక సంస్కృతి, వారసత్వాన్ని దాదాపు మరచిపోయేలా చేసిందని జంతు సంక్షేమ బోర్డు 'ఆవు కౌగిలింతల దినోత్సవం' జరుపుకోవాలని చేసిన విజ్ఞప్తిలో అంతకుముందు పేర్కొంది.
సాంప్రదాయకంగా వాలెంటైన్స్ డేగా జరుపుకునే ఫిబ్రవరి 14ను యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆవు కౌగిలింత దినంగా ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయంతో వందలాది మీమ్స్, జోకులు కూడా మొదలయ్యాయి. దీంతో ఫిబ్రవరి 14ను ఆవు కౌగిలింత దినోత్సవంగా పాటించాలన్న నిర్ణయాన్ని జంతు సంక్షేమ బోర్డు వెనక్కి తీసుకుంది.
'కౌ హగ్ డే' ప్రకటనపై ప్రతిపక్షాలు ఎమన్నాయంటే..?
బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రధానికి పవిత్రమైన ఆవు అని శివసేన (యూబీటీ) విమర్శించింది. ప్రధాన స్రవంతి సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి గో హగ్ డే బూటకపు హిందూయిజం, బూటకపు దేశభక్తి అని బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సంతును సేన్ అన్నారు. కాగా, ఆవు కౌగిలింత రోజు అనేది హాస్యాస్పదమనీ, దేశానికి సిగ్గుచేటు అని సీపీఎం నేత ఎలమరం కరీం అన్నారు. 'నేను వ్యవసాయ సమాజం నుంచి వచ్చాను. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పక్కదారి పట్టించేందుకే నేను ప్రతిరోజూ నా ఆవును కౌగిలించుకుంటాను' అని కాంగ్రెస్ నేత రజనీ పాటిల్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
