Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడం లేదని మాజీ ప్రియుడి కుమారుడిని హతమార్చిన మహిళ.. ఎక్కడంటే ?

వివాహేతర సంబంధానికి అంగీకరించలేదని ఓ మహిళ తన మాజీ ప్రియుడి కుమారుడిని హతమార్చింది. అనంతరం బాలుడి డెడ్ బాడీని అతడి ఇంట్లోని ఓ బాక్స్ బెడ్ లో దాచింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

The woman who killed her ex-boyfriend's son did not agree to an extra-marital affair..ISR
Author
First Published Aug 12, 2023, 9:58 AM IST

ఓ మహిళకు కొంత కాలం కిందట ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అతడు తన తప్పు తెలుసుకొని ఆ బంధాన్ని తెంచేశాడు. కొంత కాలం తరువాత అతడు పని చేసే ఆఫీసులోనే ఆ మహిళ కూడా ఉద్యోగంలో చేరింది. మళ్లీ తనతో గతంలో ఉండాలని ఒత్తిడి తెచ్చింది. కానీ దానికి అతడు అంగీకరించలేదు. దీనిపై కక్ష పెంచుకున్న ఆ మహిళ అతడి కుమారుడిని హతమార్చింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పశ్చిమ ఢిల్లీలోని ఇందర్‌పురిలోని నీలు అనే మహిళ తన భర్త, 11 ఏళ్ల కుమారుడితో కలిసి నివసిస్తోంది. భార్య భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే భర్తకు 2019లో పూజ అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కానీ కొంత కాలం తరువాత ఆ బంధాన్ని అతడు పూర్తిగా వదిలేసుకున్నాడు. చక్కగా భార్యా, పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. 

ఈ క్రమంలో పూజ అతడు పని చేసే సంస్థలో ఇటీవల ఉద్యోగంలో చేరింది. తనతో గతంలో ఉన్న మాదిరిగా ఉండాలని అతడిని కోరింది. తిరిగి వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ దానికి అతడు అంగీకరించలేదు. ఆమెకు చివాట్లు పెట్టాడు. దీంతో ఆమె అతడిపై కోపం పెంచుకుంది. అతడి కుమారుడిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. 

కాగా.. ఎప్పటిలాగే గురువారం భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్లారు. దీంతో సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో పూజ తన మాజీ ప్రియుడి ఇంటికి వచ్చింది. బాలుడు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఆమె అతడిని హతమార్చింది. ఆ ఇంట్లో ఉన్న బాక్స్ బెడ్ లో డెడ్ బాడీని ఉంచింది. తరువాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. 

అయితే బాలుడి తల్లి తన విధులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో కుమారుడి డ్యాన్స్ టీచర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. బాలుడు డ్యాన్స్ క్లాసుకు రాలేదని చెప్పింది. దీంతో ఆమె కంగారు పడింది. ఏదో జరిగిందని ఆందోళన చెందుతూ ఇంటికి చేరుకుంది. అయితే ఇంట్లో నీలుకు తన కుమారుడు కనిపంచలేదు. దీంతో చుట్టుపక్కల కూడా గాలించింది. మైక్రోవేవ్ ఓవెన్,  స్టూల్ మంచం మీద పెట్టి ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు తన కుమారుడు ఇంటిని శుభ్రం చేస్తుంటాడు కాబట్టి పిల్లాడే వాటిని అక్కడ పెట్టి ఉంటాడని భావించింది. ఎప్పుడూ ఉంచే స్థలంలో తాళం చేతులు కనిపించలేదు. 

తన కుమారుడు తప్పిపోయాడని భావించి నీలు.. తన భర్తకు, ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. దీంతో అందరూ బాలుడి కోసం గాలించడం మొదలుపెట్టారు. మళ్లీ భర్తకు ఫోన్ చేసి.. పూజనే తమ కుమారుడిని ఏదో చేసి ఉంటుందని ఆరోపించింది. తరువాత ఇంట్లోకి వెళ్లి నిశితంగా పరిశీలించింది. బాలుడు ధరించే అన్ని షూ లు ఇంట్లోనే ఉన్నాయి. కాబట్టి కుమారుడు బయటకు కచ్చితంగా వెళ్లలేదని నిర్ధారించుకుంది.

అయితే బెడ్ పై ఉన్న పరుపు కొంచెం లేచి ఉండటాన్ని గమనించింది. తరువాత బెడ్ బాక్స్ తెరిచి చూసింది. దీంతో కొన్ని బట్టల కింద కుమారుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. అతడి మెడకు గాయం, రక్తపు మరకలు కూడా కనిపించాయి. వెంటనే ఆమె కన్నీరు మున్నీరవుతూ సమీపంలోని క్లినిక్ తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలుడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు ఆ క్లినిక్ కు చేరుకున్నారు. తల్లి నీలు ఫిర్యాదు మేరకు ఇందర్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితురాలైన పూజ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని డీసీపీ (పశ్చిమ) విచిత్ర వీర్ తెలిపారు. నిందితురాలు బాధిత కుటుంబానికి ముందే తెలుసని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios