పన్నెండేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాధితురాలు ఏడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో హాస్పిటల్ కు వెళ్లింది. దీంతో అక్కడి డాక్టర్లు బాలికకు ప్రసవం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేడు సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా ఓ పన్నెండేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. తను గర్భవతి అయిన సంగతి కూడా బాలిక కు తెలియదు. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది.
ఘోరం.. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నిస్తోందని.. భార్యపై వేడి సాంబార్ పోసిన భర్త..
వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లా ఫగ్వారా పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలోని పన్నెండేళ్ల బాలిక తన తండ్రితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఏడు నెలల క్రితం బహిర్భూమికి వెళ్లింది. బాలిక బయటకు రావడాన్ని గమనించిన ఓ దుండుగుడు.. ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
కొంత సమయం తరువాత బాధితురాలు ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆ బాలిక తండ్రికి వివరించలేకపోయింది. కొన్ని రోజుల తరువాత బాలికకు కడుపునొప్పి వేసింది. ఇంట్లో మహిళలు ఎవరూ లేకపోవడంతో బాలికతో పాటు తండ్రికి కూడా ఆమె గర్భం దాల్చిన సంగతి తెలియరాలేదు. సాధారణ కడుపునొప్పి అనుకొని ఆ తండ్రి బాలికకు మాత్రలు తెచ్చిచాడు. ఇలా బాలిక కడుపునొప్పి అని అన్నప్పుడల్లా ట్యాబ్లెట్లు తెచ్చి ఇచ్చేవాడు.
చావులో సైతం వీడని స్నేహం.. స్నేహితుడి చనిపోయాడని, చితిలో దూకిన వ్యక్తి..
కానీ ఇటీవల కడుపు నొప్పి ఎక్కువ కావడంతో బాలికను గురునానక్ దేవ్ హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. పరీక్షించిన డాక్టర్లు బాలిక గర్భంతో ఉందని తేల్చారు. ఈ విషయం విని బాలిక, ఆ తండ్రి షాక్ అయ్యారు. తరువాత బాలికకు డెలివరీ చేశారు. 800 గ్రాముల బరువున్న పాప జన్మించింది. అయితే వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. ఈ విషయాన్ని డాక్టర్లు పోలీసులకు తెలియజేయడంతో వారు హాస్పిటల్ కు చేరుకున్నారు.
తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్.. ‘కమలం’ను వీడి ‘హస్తం’ అందుకున్న కీలక నేత.. మళ్లీ బలపడుతున్న కాంగ్రెస్
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తన బిడ్డ ఏడు నెలల నుంచి కడుపు నొప్పి అంటోందని, కానీ ఆమె గర్భం దాల్చిన విషయం తనకు తెలియదని బాధితురాలి తండ్రి వివరించాడు. హాస్పిటల్ కు వచ్చిన తరువాతే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. బాధితురాలిని ప్రశ్నించగా.. ఏడు నెలల కిందట తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, నిందితుడిని గుర్తించి, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.