అబార్షన్ పిల్ వేసుకున్న ప్రెగ్నెంట్ మైనర్ మృతి.. బాయ్ఫ్రెండ్ అరెస్టు
తమిళనాడులో గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలికకు బాయ్ ఫ్రెండ్ అబార్షన్ టాబ్లెట్ తెచ్చి ఇచ్చాడు. ఈ టాబ్లెట్ వేసుకోగానే ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హాస్పిటల్ తీసుకెళ్లగా బాలిక అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.
చెన్నై: తమిళనాడులో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక గర్భవతి అయింది. ఆమెకు బాయ్ఫ్రెండ్ అబార్షన్ కోసం పిల్ ఇచ్చాడు. ఆ టాబ్లెట్ వేసుకోగానే స్పృహ కోల్పోయి పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లగా.. అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. తిరువన్నమలైలోని చెంగాంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చెంగాంకు చెందిన ఓ 15 ఏళ్ల బాలికను 27 ఏళ్ల ఎస్ మురుగన్ రోజూ స్కూల్కు తీసుకెళ్లేవాడు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య రిలేషన్షిప్ డెవలప్ అయింది. అది శారీరకంగానూ మారింది. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. వారి మధ్య గుట్టుగా సాగుతున్న వ్యవహారాన్ని అలాగే రహస్యంగా ఉంచాలనుకున్నాడు మురుగన్. అందుకే ఎవరికీ తెలియకుండానే అబార్షన్ చేయించాలని ప్రయత్నించాడు.
ఇందుకోసం మురుగన్ తన స్నేహితుడు 27 ఏళ్ల ప్రభును సంప్రదించాడు. గర్భస్రావం కోసం ఫ్రెండ్ ప్రభు ఓ పిల్ను ఎస్ మురుగన్కు ఇచ్చాడు.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఎస్ మురుగన్ ఆ 15 ఏళ్ల బాలికను స్కూల్ కోసం ఇంటికి వెళ్లి తీసుకెళ్లాడు. స్కూల్కు తీసుకెళ్తున్న దారిలోనే ఆమెకు ఆ అబార్షన్ పిల్ ఇచ్చాడు. ఆమె ఆ దారిలోనే అబార్షన పిల్ వేసుకున్నది. అబార్షన్ పిల్ వేసుకున్నాక ఇద్దరూ స్కూల్ వైపు వెళ్లుతుండగా ఆ బాలిక స్పృహ కోల్పోయి పడిపోయింది. దీంతో మురుగన్ ఆ బాలికను వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కు తరలించాడు.
కానీ, అప్పటికే సమయం మించిపోయింది. హాస్పిటల్కు తెచ్చే లోపే బాలిక మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. ఆ తర్వాత బాలిక డెడ్ బాడీకి పోస్టు మార్టం చేయడానికి తిరువన్నమలై ప్రభుత్వ హాస్పిటల్కు పంపారు.
ఆ అబార్షన్ పిల్ను ఎస్ మురుగన్ ఫ్రెండ్ ప్రభు.. ఓ డాక్టర్ దగ్గర సంపాదించినట్టు తెలిసింది.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మురుగన్ను, ఆయన ఫ్రెండ్ ప్రభును కస్టడీలోకి తీసుకున్నారు. మురుగన్ను పోక్సో యాక్ట్ కింద కూడా బుక్ చేశారు. కాగా, అబార్షన్ పిల్ ఇచ్చిన ఆ నకిలీ డాక్టర్ కోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నారు.