ఈ సంఘటన గురువారం సరాయ్ కాలే ఖాన్ బస్టాండ్ సమీపంలో జరగగా, సాయంత్రం 4.31 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు.
న్యూఢిల్లీ : ఆగ్నేయ ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ వద్ద జరిగిన గొడవలో యువకుడిని కత్తితో పొడిచి చంపినందుకు 31 ఏళ్ల టాక్సీ డ్రైవర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
ఈ సంఘటన గత గురువారం సరాయ్ కాలే ఖాన్ బస్టాండ్ సమీపంలో జరగింది. ఆ సాయంత్రం 4.31 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, సమీపంలో నివసించే కొంతమందికి, టాక్సీ డ్రైవర్కు మధ్య వాగ్వాదం జరిగినట్లు గుర్తించారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, అంతకుముందు రోజు, ముగ్గురు మైనర్లు, బాధితుడు ఆకాష్ (18) గురుద్వారా బంగ్లా సాహిబ్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు. వారు తిరిగి వస్తుండగా, పిల్లల చేయి ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని పాదచారికి తాకింది. అతను పిల్లవాడిని అరుస్తూ దుర్భాషలాడడం ప్రారంభించాడు.
సైట్ గుండా వెళుతున్న ఒక టాక్సీ డ్రైవర్, దీంట్లో జోక్యం చేసుకున్నాడు. కొంత సమయం తర్వాత అతను కారు డిక్కీ నుండి తీసిన చెక్క కర్రతో ఆకాష్ను కొట్టాడు, ఆ తర్వాత బాధితుడు పడిపోయాడని అధికారి తెలిపారు.
విషయం తెలుసుకున్న ఆకాష్ సోదరి తన సోదరులు వికాస్ మరియు గౌరవ్లను సంఘటనా స్థలానికి పంపింది, వారు ఆకాష్.. అతని ముగ్గురు స్నేహితులతో కలిసి టాక్సీ డ్రైవర్ వద్దకు వెళ్ళారు, ఫలితంగా మరో గొడవ జరిగిందని అధికారి తెలిపారు. దీంతో రెచ్చిపోయన టాక్సీ డ్రైవర్ ఆకాష్ను కత్తితో పొడిచి, టాక్సీని వదిలి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన ఆకాష్ను ఎయిమ్స్ ట్రామా సెంటర్కు తీసుకెళ్లారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కొంతమంది ప్రత్యక్ష సాక్షులతో సహా బాధిత కుటుంబ సభ్యులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి సోదరి - మోనా (32) వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
మీ నాయకురాలు సోనియానా.. వసుంధరా రాజేనా, త్వరలోనే నిర్ణయం చెబుతా : అశోక్ గెహ్లాట్పై సచిన్ సెటైర్లు
టాక్సీ యజమాని ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాకు చెందిన అశ్వనీ శర్మగా గుర్తించారు. అతడిని సంప్రదించగా... ప్రగతి విహార్లోని ఖోడా కాలనీలో నివాసం ఉంటున్న రూపేష్ కుమార్ తన టాక్సీని నడుపుతున్నాడని చెప్పాడు. అనేక చోట్ల గాలించి కుమార్ను అరెస్టు చేశారు.
