టూరిజంలో కీలక పరిణామం.. లక్షద్వీప్లో టాటా రిసార్ట్స్ ఏర్పాటు..
లక్షద్వీప్లోని సుహేలి, కద్మత్ దీవులలో రెండు తాజ్-బ్రాండెడ్ రిసార్ట్ల కోసం టాటా గ్రూప్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ రిసార్ట్లు 2026లో తెరవబడతాయి.
![TATA Group to Make 2 Taj Branded Resorts in Lakshadweep KRJ TATA Group to Make 2 Taj Branded Resorts in Lakshadweep KRJ](https://static-ai.asianetnews.com/images/01hkn2ezxyt4z7a0z09njpt3w9/modi_363x203xt.jpg)
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లోని సుహేలి, కద్మత్ దీవులలో రెండు తాజ్-బ్రాండెడ్ రిసార్ట్ల ఏర్పాటు కోసం టాటా గ్రూప్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రిసార్ట్లు 2026 నాటికి అందుబాటులోకి రానున్నాయి. రాజస్థాన్, కేరళ, గోవా , అండమాన్ వంటి గమ్యస్థానాలు విహారయాత్రలుగా ప్రజాదరణ పొందుతున్న వేళ.. ప్రయాణికులకు ప్రత్యేకమైన, పర్యావరణ స్పృహతో కూడిన అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యూహాత్మక అడుగు
దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య వ్యూహాత్మక అడుగు. లక్షద్వీప్ను భారతీయ పర్యాటకులకు ప్రధాన హాలీడే స్టాట్ గా ప్రచారం చేయడానికి అనుగుణంగా కంపెనీ ఈ వ్యూహాత్మక చర్యను తీసుకుంది. ముఖ్యంగా భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. ఈ సమయంలో అద్భుతమైన ద్వీపాన్ని సందర్శించమని ప్రజలను ప్రోత్సహించాడు. అతని విజ్ఞప్తి మాల్దీవులకు చెందిన కొంతమంది మంత్రులు అవమానించారు. వారు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
రిసార్ట్స్ ప్రత్యేకతలు
తాజ్ సుహేలీలో 60 బీచ్ విల్లాలు, 50 వాటర్ విల్లాలతో సహా 110 గదులు ఉంటాయి. తాజ్ కద్మత్లో 110 గదులు ఉంటాయి, ఇందులో 75 బీచ్ విల్లాలు , 35 వాటర్ విల్లాలు ఉన్నాయి. కడ్మత్ ద్వీపం, ఏలకుల ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇది ఒక పగడపు ద్వీపం . సముద్ర తాబేళ్లను గూడు కట్టుకోవడానికి అనువైన ప్రాంతం.
IHCL విస్తరణ
లక్షద్వీప్తో పాటు, ఉత్తరప్రదేశ్లోని దుధ్వాలోని సెలక్షన్స్ హోటల్ జాగీర్ మనోర్తో IHCL తన పోర్ట్ఫోలియోను విస్తరించింది. తోటలు , అడవుల మధ్య ఉన్న ఈ 20-గదుల హోటల్లో 1940ల నాటి వారసత్వ గదులు, విలాసవంతమైన విల్లాలు ఉన్నాయి. ఈ వైవిధ్యీకరణ దేశవ్యాప్తంగా విభిన్నమైన , గొప్ప ఆతిథ్య అనుభవాలను అందించడానికి IHCL కొనసాగుతున్న ప్రయత్నాలకు చిహ్నం.