దొంగిలించడానికి లిక్కర్ షాపులోకి దూరారు.. తప్పతాగి పడిపోయారు.. చివరకు..!
తమిళనాడులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు దొంగలు ఓ లిక్కర్ షాపులో చోరీ చేయాలని ప్లాన్ వేశారు. లిక్కర్ షాపు గోడకు కన్నం వేశారు. లోపలికి వెళ్లారో లేదో.. లిక్కర్ బాటిళ్లను ముందు పెట్టుకుని ఫుల్గా తాగేశారు. తాగి వారు ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో అనే విషయాలను సైతం మరిచిపోయారు. అటుగా వచ్చిన పోలీసులు గోడకు కన్నం చూసి పరిశీలించగా దొంగలు పడ్డట్టు గుర్తించారు. ఆ దొంగలను బలవంతంగా పోలీసులే బయటకు తీసుకురావాల్సి వచ్చింది.
చెన్నై: ఇద్దరు దొంగలు చోరీ కోసం ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇళ్లు.. వ్యాపార సముదాయాలు కాకుండా ఓ లిక్కర్ షాపునకు కన్నం వేయాలని అనుకున్నారు. ఆ లిక్కర్ షాపు క్లోజ్ అయ్యే వరకు వేచి చూశారు. ఆ తర్వాత ఆ మద్యం దుకాణం గోడకు కన్నం వేశారు. అందులోకి దూరారు. తీరా లోపల అడుగు పెట్టిన తర్వాత చోరీ చేసే పనిని వాయిదా వేశారు. ర్యాకుల్లోని మందుబాటిళ్లను ముందు పెట్టుకున్నారు. తప్పతాగి తూగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే, ఆ చప్పుళ్లు విని అటు వెళ్తున్న ఓ పెట్రోలింగ్ పోలీసు బృందం పరిశీలించింది. ఆ లిక్కర్ షాపు గోడకు కన్నం వేసిన విషయాన్ని గమనించారు. చోరీ చేయడానికి వెళ్లిన దొంగలు లోపలే తాగి పడిపోయారని గుర్తించారు. చివరకు ఆ పోలీసులే వారిని లోపలి నుంచి బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువల్లూర్లో చోటుచేసుకుంది.
తిరువల్లూర్లోని కవరాయిపెట్టయిలో తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్మాక్ లిక్కర్ షాపు ఉన్నది. ఈ లిక్కర్ షాపులో దొంగతనం చేయలని ఇద్దరు చోరులు ప్లాన్ వేశారు. షాప్ బిజినెస్ అవర్స్ పూర్తయ్యాక దానికి తాళం వేసి వెళ్లిపోయారు నిర్వాహకులు. అదునైన సమయం చూసుకుని ఆ దొంగలు ఇద్దరూ లిక్కర్ షాపు గోడకు పెద్ద కన్నం వేశారు. ఆ కన్నం ద్వారా లోపలికి ప్రవేశించారు.
వారు లోపలికి వెళ్లారో లేదో.. వెంటనే లిక్కర్ బాటిళ్లు ముందు పెట్టుకుని కూర్చున్నారు. పూటుగా తాగి వారు ఎక్కడ ఉన్నారు? అదే సందర్భం అనే అంశాల పైనా వారికి స్పృహ లేకుండా పోయింది.
ఆ స్టోర్ నుంచి వస్తున్న శబ్దాలను అటుగా వచ్చిన ఓ పెట్రోల్ వాహనం విన్నది. ఆ పోలీసులు షాపు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఆ గోడకు పెద్ద కన్నం పడి ఉండటం చూసి ఖంగుతిన్నారు. ఇద్దరు దొంగలు లిక్కర్ షాపులోకి దూరి అక్కడే తాగుడు ప్రోగ్రామ్ పెట్టినట్టు గుర్తించారు.
వారే బలవంతంగా ఆ ఇద్దరు దొంగలను కన్నం ద్వారా బయటకు తేవాల్సి వచ్చింది. బయటకు వచ్చిన దొంగలు తమ నేరాన్ని అంగీకరించారు. వారు ఆ షాప్ నుంచి లిక్కర్ బాటిళ్లు దొంగలించాలనేదే తమ ఉద్దేశ్యం అని వారు వివరించినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. వారి నుంచి పోలీసులు రూ. 14 వేలు రికవరీ చేసుకున్నారు.