Cuddalore Road Accident: తమిళనాడులోని కడలూరు జిల్లా మేల్పట్టంపాక్కంలో రెండు ప్ర‌యివేటు బస్సులు ఢీకొన్న ఘటనలో 70 మందికి గాయాలయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు చికిత్స పొందుతూ న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Road Accident: త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. రెండు ప్ర‌యివేటు బ‌స్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. 70 మంది గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఈ దుర్ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

వివ‌రాల్లోకెళ్తే.. తమిళనాడులోని కడలూరు జిల్లాలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కడలూరు- పన్రుతి మధ్య రెండు ప్ర‌యివేటు బస్సులు ప్రయాణిస్తున్నాయి. ఒక బస్సు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానికులు కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Scroll to load tweet…

ఈ ప్ర‌మాదంపై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Scroll to load tweet…