15 కి.మీ. అడవి గుండా 30 ఏళ్లు: ఉత్తరాలు పంచిన పోస్టుమ్యాన్
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాలు, టెలిగ్రాం వంటి వాటి గురించి మనం మర్చిపోయాం. అయితే ఓ పోస్టుమాన్ ప్రతి రోజూ 15 కి.మీ అడవి గుండా నడుచుకొంటూ వెళ్లి మారుమూల గ్రామాలకు ఉత్తరాలను అందిస్తుంటాడు శివన్. 30 ఏళ్లుగా ఆయన క్రమం తప్పకుండా ఆయన ఈ విధులను నిర్వహిస్తున్నాడు.
చెన్నై: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాలు, టెలిగ్రాం వంటి వాటి గురించి మనం మర్చిపోయాం. అయితే ఓ పోస్టుమాన్ ప్రతి రోజూ 15 కి.మీ అడవి గుండా నడుచుకొంటూ వెళ్లి మారుమూల గ్రామాలకు ఉత్తరాలను అందిస్తుంటాడు శివన్. 30 ఏళ్లుగా ఆయన క్రమం తప్పకుండా ఆయన ఈ విధులను నిర్వహిస్తున్నాడు.తమిళనాడు రాష్ట్రంలోని సింగారా, మారపళ్లం గ్రామాలకు శివన్ ప్రతి రోజూ వెళ్లి ఉత్తరాలు, ప్రభుత్వం అందించే పెన్షన్లను అందిస్తున్నాడు.
ప్రతిరోజూ అతను కూనూరు సమీపంలోని హిల్గ్రోవ్ పోస్టాఫీసు నుండి 15 కి.మీ. దూరం అడవి గుండా ఈ గ్రామాలను చేరుకొంటాడు. ఈ అడవి గుండా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని స్థానికులు చెబుతారు.
ఏ జంతువు ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తోందోననే భయం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కానీ ఈ భయాలను లెక్క చేయకుండా ఆయన 30 ఏళ్ల పాటు ఇదే దారిలో ప్రయాణిస్తూ ప్రజలకు ఉత్తరాలు, మనీఆర్డర్లు, పెన్షన్లు అందించారని స్థానికులు శివన్ సేవలను గుర్తు చేసుకొంటున్నారు. ఏనుగులు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువులను ఆయన ఈ దారి గుండా వెళ్లే సమయంలో చాలాసార్లు చూశాడు.
అయితే ఏ రోజు కూడ శివన్ కు అడవి జంతువులు అడ్డుపడలేదు. శివన్ గత వారంలో రిటైరయ్యారు. శివన్ రిటైర్మెంట్ ను పురస్కరించుకొని ఐఎఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్ వేదికగా శివన్ అంకిత భావాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు నెటిజన్లు స్పందించారు. కొందరు ఆయనకు సెల్యూట్ చేశారు. ఓ నెటిజన్ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వాలని కోరారు. ఈ అవార్డుకు ఆయన అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు.