భార్యతో వివాహేతర సంబంధం అనుమానం.. యువకుడిని చంపి, 10 ముక్కలు చేసి.. మూడు సంచుల్లో కుక్కి...
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశాడో భర్త. ఆ విషయం వెలుగులోకి రావడంతో అరెస్ట్ అయ్యాడు.
ఉత్తర్ ప్రదేశ్ : వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు నేపథ్యంలో హత్యలు జరుగుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఓ వ్యక్తి 24 ఏళ్ల యువకుడిని హత్య చేశాడు. ఆ యువకుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమో అనే అనుమానమే దీనికి కారణం. చంపేసిన తర్వాత అంతటితో ఆగకుండా.. అతని మృతదేహాన్ని దారుణంగా పది ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికిన ఆ శరీర భాగాలను మూడు సంచుల్లో మూటగట్టి పొదల్లో విసిరేశాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఉంటున్న ఓ రిక్షా కార్మికుడు ఈ అత్యంత దారుణమైన హత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని అక్షయ్ (24)గా గుర్తించారు పోలీసులు. అతను రాజస్థాన్ లోని కోట్ పుట్లి పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హత్య వెలుగులోకి రావడంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి కత్తులు, కొడవళ్లతో దారుణ హత్య.. చనిపోయిన వ్యక్తి ఎవరంటే...
ఈ హత్యకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రిక్షా కార్మికుడైన మిహ్లాల్ (34) భార్య పూనమ్. ఆమె అతనికి రెండో భార్య. గత కొద్ది రోజులుగా మిహ్లాల్.. పూనమ్ మీద అనుమానం పెంచుకున్నాడు. అక్షయ్ అనే యువకుడితో తన రెండో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా సదరు వ్యక్తిని చంపాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం.. అక్షయ్ ని హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి… దగ్గరలోని కాలువ పక్కన మూడు సంచుల్లో మూటగట్టి పడేశాడు.
శనివారం కాలువ పక్కన సంచుల్లో ఉన్నమృతుడి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో రిక్షా కార్మికుడైన మిహ్లాల్ మీదికి అనుమానం వెళ్ళింది. తడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరమాంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. హత్యానేరం కింద జైలుకు పంపించినట్లు వెల్లడించారు.