కోయంబత్తూరులో కారు బాంబు పేలుడులో వెలుగుచూసిన సంచలన విషయాలు !
Tamil Nadu: కోయంబత్తూరులో కారు బాంబు పేలుడు ఘటనతో సంబంధముందనే అనుమానంతో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉగ్రకుట్ర వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.
COIMBATORE: తమిళనాడులోని కారు బాంబు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది సుసైడ్ బాంబర్ ఘటనగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్టు తెలిపారు. కోయంబత్తూరులోని ఓ ఆలయం ముందు గత ఆదివారం కారు బాండు పేలిన ఘటనలో 29 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతను బహుశా సూసైడ్ బాంబర్ అయి ఉంటాడనీ, పేలుడు పదార్థాలను నిర్వహించడంలో పెద్దగా అనుభవం లేకపోవడంతో ముందుగానే పేలుడు జరిగివుంటుందని దర్యాప్తు అధికారులు శుక్రవారం నాడు తెలిపారు. ముందుగా ఈ కారు బాంబు పేలుడు ఘటనపై రాష్ట్ర పోలీసులు విచారణను ప్రారంభించారు. అయితే, ఉగ్రకుట్ర వెలుగులోకి రావడంతో తమిళనాడు సర్కారు ఎన్ఐఏ విచారణను కోరింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది.
2009లో ఎన్ఐఏ విచారించిన జమీషా ముబిన్ దీపావళి సందర్భంగా ఉదయం 4 గంటలకు కొట్టైమేడులోని సంగమేశ్వర ఆలయం ముందు కారు ఆపాడు. ఈ క్రమంలోనే కారు పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు. కొన్ని అడుగుల దూరంలో నేలపై పడిపోయే ముందు అతను బాంబు మంటల్లో చిక్కుకునీ, కారులోంచి బయటకు వచ్చాడని దర్యాప్తు చేస్తున్న అధికారులు పేర్కొన్నారు. అక్కడున్న స్థానికులు, పోలీసులు స్పందించేలోపే మృతదేహం కాలిపోయింది. వాహనంలోని రెండు ఎల్పీజీ సిలిండర్లలో ఒకదాని కారణంగా పేలుడు సంభవించి ఉంటే, దేవాలయానికి దారితీసే రహదారి వెంబడి ఉన్న వరుసల ఇళ్లు ప్రభావితమయ్యేవని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఐఎస్ సాహిత్యానికి బహిర్గతం అయిన తరువాత ముబిన్ తీవ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నాడనీ, కానీ ఉగ్రవాద వ్యూహాలలో శిక్షణ పొందలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, బాంబు తయారీకి సంబంధించి సమాచారం ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడని పేర్కొన్నారు. తన ఆత్మాహుతి దాడి మిషన్ 50 నుండి 100 మీటర్ల వ్యాసార్థం ఉన్న ప్రాంతాన్ని నాశనం చేస్తుందని భావించాడని తెలిపారు.
శనివారం ఆలస్యంగా, ముబిన్, అతని ఇద్దరు సహచరులు మహ్మద్ అజరుద్దీన్, కే అఫ్సర్ ఖాన్ లు కారులో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, సల్ఫర్, బొగ్గు, మేకులు, బాల్ బేరింగ్లతో పాటు రెండు ఎల్పీజీ సిలిండర్లతో నింపిన మూడు స్టీల్ డ్రమ్లను ఉంచారు. ఈ ఘటనను సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిందని తెలిపారు. పేలుడుకు ముందు ముబిన్, అతని సహచరుల కదలికలను ఇతర కెమెరాల నుండి ఫుటేజ్ చూపిస్తుంది.ఈ ముగ్గురూ బిగ్ బజార్ వీధిలోని కొనియామ్మన్ ఆలయంతో పాటు పులియకుళం ముండి వినాయకర్ మందిరంలో రెక్కీ నిర్వహించారు. అలాగే, అరెస్టయిన వీరిద్దరూ గాంధీ పార్కులోని ఎల్పీజీ బుకింగ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ రెండు సిలిండర్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ముగ్గురూ లారీపేటలోని పాత మార్కెట్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మూడు ఉక్కు డ్రమ్ములను కొనుగోలు చేశారు.
ప్రస్తుతం కోయంబత్తూరు నగర పోలీసులతో ఉన్న మాజీ ఎన్ఐఏ అధికారి శివకుమార్, ఉగ్రవాదుల కుట్రను పరిశోధకులకు తెలియజేసిన సమాచారాన్ని క్రోడీకరించడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో ముబిన్ కు రాడికల్ శక్తులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఎన్ఐఏ మాజీ అధికారి ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనను ముబిన్ ఇంటిలో శోధన ప్రారంభించాడు, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే 75 కిలోల మిశ్రమ రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.