Asianet News TeluguAsianet News Telugu

శబరిమల ఆలయానికి కొత్త చట్టం చేయండి: కేరళ సర్కార్‌కు సుప్రీం ఆదేశం

శబరిమల ఆలయ నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దేవస్థానం నిర్వహణకు కొత్త చట్టాన్ని రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది

Supreme Court has asked Kerala govt to bring separate new law for sabarimala
Author
New Delhi, First Published Nov 20, 2019, 3:16 PM IST

శబరిమల ఆలయ నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దేవస్థానం నిర్వహణకు కొత్త చట్టాన్ని రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

జనవరి మూడో వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని ఆదేశాల్లో పేర్కొంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు విచారించింది.

ఇదే సమయంలో మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై బుధవారం విచారణ జరిపిన జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని ధర్మాసనం కేరళలోని ఇతర ఆలయాలతో కలిపి చట్టం తీసుకురావడం సమంజసం కాదని బెంచ్ పేర్కొంది. 

Also Read:తెరుచుకున్న శబరిమల ఆలయం: 10 మంది మహిళలను వెనక్కి పంపిన పోలీసులు

మరోవైపు శబరిమల కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన క్రమంలో.. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంపై గందరగోళం నెలకొంది. గత గురువారం తీర్పులో స్పష్టత లేకపోవడంతో మహిళల ప్రవేశాన్ని ప్రోత్సహించకూడదని కేరళ సర్కార్ నిర్ణయించింది. 

నేడు శబరిమల ఆలయ తలుపులనుఈ తెరిచి మండల పూజ నిర్వహిస్తారు. రేపటి నుండి భక్తులను అనుమతిస్తారు. తీర్పుపై మరింత స్పష్టత వచ్చిన తర్వాతే యువతులను అనుమతించే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఇలా నిషేధిత వయసులో ఉన్న మహిళల ప్రవేశాన్ని ప్రోత్సహించే ఏ నిర్ణయం అయినా రెచ్చగొట్టడం మాత్రమే కాకుండా, మాత పరమైన సంస్థలకు హింసకు తెగబడే అవకాశం ఇస్తుందని అభిప్రాయపడింది.

సిపిఎం సెక్రటేరియట్ సభ్యుడు, న్యాయ మంత్రి ఎ.కె. బాలన్ ఈ తీర్పుపై కోర్టుకు కూడా స్పష్టత లేదని అన్నారు. “ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తే, వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ఎవరినీ అనుమతించదు,”అని అన్నారు.

కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. ఆలయ ప్రవేశానికి ప్రయత్నించే మహిళలు కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తారని అభిప్రాయపడ్డారు.

యాక్టివిజం ప్రదర్శించడానికి కొందరు వ్యక్తులు శబరిమలను వేదికగా ఎంచుకుంటామంటే కుదరదని, కొందరు ఏకంగా ప్రెస్ మీట్లు నిర్వహించి మరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదన్నారు.

Also Read:శబరిమల ఆలయంలోకి మహిళలు.. నేడే తుది తీర్పు

ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని, మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని అన్నారు.

ఒకవేళ ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే సుప్రీంకోర్టు తీర్పు పత్రాలను కూడా తెచ్చుకోవాలని, అవి చూపెడితే మాత్రమే అనుమతిస్తామని అన్నారు. శబరిమల తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళతామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios