Asianet News TeluguAsianet News Telugu

విమాన ప్రమాదంలో మృతుడి కుటుంబానికి రూ.7.6 కోట్లు చెల్లించాలి: ఎయిరిండియాకు సుప్రీం ఆదేశం

విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణీకుడి కుటుంబానికి రూ.7.64 కోట్లను పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఎయిరిండియాను ఆదేశించింది. 2010లో జరిగిన ప్రమాదంపై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

Supreme Court awards Rs 7.6 crore relief to family of Mangaluru crash victim
Author
New Delhi, First Published May 22, 2020, 12:12 PM IST

న్యూఢిల్లీ: విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణీకుడి కుటుంబానికి రూ.7.64 కోట్లను పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఎయిరిండియాను ఆదేశించింది. 2010లో జరిగిన ప్రమాదంపై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది.

2010లో మంగుళూరులో విమాన ప్రమాదం చోటు చేసుకొంది.దుబాయ్ నుండి 166 మంది ప్రయాణీకులతో వచ్చిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 158 మంది మరణించారు. 

Supreme Court awards Rs 7.6 crore relief to family of Mangaluru crash victim

మృతుల్లో యూఏఈకి చెందిన ఓ సంస్థ రీజినల్ డైరెక్టర్ మహేంద్ర కొడ్కనీ ఉన్నారు. కొడ్కనీ కుటుంబానికి రూ. 7.35 కోట్లను పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అప్పట్లో ఎయిరిండియాను ఆదేశించింది. అయితే ఈ పరిహారాన్ని ఎయిరిండియా బాధిత కుటుంబానికి చెల్లించలేదు. అంతేకాదు పలు కారణాలను చూపింది.

also read:కనిష్టం రూ. 3,500, గరిష్టం రూ. 10 వేలు: కొత్త విమాన ఛార్జీలు ఇవే

పరిహారం చెల్లించకపోవడంపై మృతుడి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను గురువారం నాడు సుప్రీంకోర్టు విచారించింది. ఎన్ సీడీఆర్సీ  పేర్కొన్నట్టుగా రూ. 7.35 కోట్ల పరిహారంంలో ఇప్పటివరకు చెల్లించని మొత్తానికి ఏడాదికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించింది. 

Supreme Court awards Rs 7.6 crore relief to family of Mangaluru crash victim

ఒక ఉద్యోగికి ఉన్న స్థాయి ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనా వేయాలి. అతని మరణంతో సంభవించిన నష్టాన్ని నిర్ణయం తీసుకొనే సమయంలో అతని అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios