మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాశాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచన మేరకు తాను బీఆర్ఎస్ ఆఫీసులో ఆ పార్టీ నేతకు రూ.15 కోట్లు ఇచ్చానని చెప్పాడు.
మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లో వున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబు పేల్చాడు. జైలు నుంచే ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు లేఖ రాశాడు. ఈ మేరకు రెండు పేజీల లేఖను విడుదల చేశాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచన మేరకు తాను బీఆర్ఎస్ ఆఫీసులో ఆ పార్టీ నేతకు రూ.15 కోట్లు ఇచ్చానని చెప్పాడు. అంతేకాకుండా బీఆర్ఎస్ లీడర్తో జరిగిన వాట్సాప్ చాట్ను కూడా లేఖలో ప్రస్తావించాడు. తనతో చాట్ చేసిన వ్యక్తి సౌత్ గ్రూప్లో వున్న బీఆర్ఎస్ లీడర్గా తెలుస్తోందన్నాడు. ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో రేంజ్ రోవర్ (కారు నెం 6069) పార్క్ చేసి వుందని సుఖేష్ అన్నాడు. ఆ కారుపై ఎమ్మెల్సీ స్టిక్కర్ వుందని చెప్పాడు. ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని స్పష్టం చేశాడు. అవసరమైతే తాను నార్కో టెస్ట్కు సిద్ధమని సుఖేష్ ప్రకటించాడు. ఇది టీజరేనన్న ఆయన అసలైన బ్లాక్ బస్టర్ ముందుందని కేజ్రీవాల్ను హెచ్చరించాడు.
కాగా.. ఇటీవల సుఖేష్ లాయర్ అనంత్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చేవారం సుఖేష్ మరో సంచలనం బయటపెడతారని అన్నారు. జైలు నుంచి ఇప్పటి వరకు ఆయన 12 లేఖలు రాశారని.. వీటిలో కొన్ని లేఖలపై హైపవర్ కమిటీ దర్యాప్తు చేస్తోందని అనంత్ మాలిక్ తెలిపారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి సుఖేష్ పనిచేశారని అనంత్ చెప్పారు.
Also Read: ఇది ట్రయలే.. వచ్చే వారం మరో సంచలనం బయటికి : బాంబు పేల్చిన సుఖేష్ లాయర్ అనంత్ మాలిక్
ఇక. సుఖేష్ చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి సంచలన లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో చేసిన వాట్సాప్ చాట్ తన వద్ద ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ చెప్పినట్టు బీఆర్ఎస్(BRS)కు రూ.75 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసిన రోవర్ కారులో ఉన్న వ్యక్తి రూ. .15 కోట్లు ఇచ్చానని లేఖలో తెలిపారు. మొత్తం 15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చానని లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే సీఎం కేజ్రీవాల్ తో చేసిన వాట్సాప్ చాట్ బయటపెడతానని, త్వరలోనే మరిన్ని అక్రమాలు బయటపెడతానని సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు.
2020లోసీఎం కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ చెప్పినట్లు బీఆర్ఎస్ ఆఫీస్ వద్దకు వచ్చి రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చాననీ, అతడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కొనసాగుతున్న మద్యం కేసు నిందితుల్లో ఒకరని , చాటింగ్ లో కొన్ని కోడ్ పదాలు వాడినట్టు పేర్కొన్నారు. 15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించానని అన్నారు. వారంలో కేజ్రీవాల్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ విషయాలు బయటకు వస్తాయనీ, కేజ్రీవాల్ అవినీతి, అక్రమాలు అన్నీ బయటపెడతానని సుఖేష్ అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో అరవింద్ కేజ్రీవాల్తో తాను మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లు చేస్తున్నానని, కేజ్రీవాల్కు 75 కోట్లు డెలివరీ చేశాడని పేర్కొంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న కన్మన్ సుకేష్ చంద్రశేఖర్ నేడు (మార్చి 31) తన న్యాయవాది అనంత్ మాలిక్ ద్వారా ఒక లేఖను విడుదల చేశారు.
