పాకిస్థాన్ లో మళ్లీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దేశ ముఖ్య పట్టణమైన ఇస్లామాబాద్ లో శుక్రవారం ఉదయం ఈ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటలో ఓ పోలీసు చనిపోయారు. సాధారణ పౌరులకు గాయాలయ్యాయి.  

పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ సిటీలో ఉన్న హైలెవెల్ మార్కెట్, యూనివర్సిటీ, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్న ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో అనేక మంది పౌరులకు గాయాలు అయ్యాయి. ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందిన వెంటనే యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ అక్కడికి చేరుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
Scroll to load tweet…

జియో న్యూస్ ప్రకారం.. ఇస్లామాబాద్ ఐ-10 ప్రాంతంలో ఓ కారు అనుమానస్పదంగా తిరుగుతోంది. అయితే ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అదీల్ హుస్సేన్ ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ కారులో ఒక్క సారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అదీల్ హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఇస్లామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. 

Scroll to load tweet…

ఘటనా స్థలానికి డీఐజీ సోహైల్ జాఫర్ చత్తా చేరుకున్నారు. మీడియాతో మాట్లాడారు. పేలుడు జరిగినప్పుడు కారులో ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. పోలీసుల చర్య వల్ల ఇస్లామాబాద్ లో ఓ పెద్ద ఘటన జరగకుండా ఆగిపోయిందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. కాగా భద్రతా అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.