Asianet News TeluguAsianet News Telugu

తనపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే పెళ్లాడిన ప్రభుత్వాధికారి

ప్రభుత్వాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే సదరు అధికారి పెళ్లాడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

sub divisional magistrate marries woman who accused him of sexual assault
Author
Lucknow, First Published Oct 13, 2019, 6:30 PM IST

లక్నో: ప్రభుత్వాధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళనే సదరు అధికారి పెళ్లాడిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివాహానికి సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ సుబ డివిజనల్ మెజిస్ట్రేట్ గా విధులు నిర్వర్తిస్తున్న దినేష్ కుమార్ అనే వ్యక్తిపై ఓ మహిళ గత కొన్ని రోజులుగా లైంగిక ఆరోపణలు చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, పెళ్ళాడమంటే రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడని సదరు యువతి ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో పెద్ద హోదాలో ఉన్న అధికారి శుక్రవారం సాయంత్రం సదరు యువతిని పెళ్లిచేసుకున్నాడు. ఖుషి నగర్ లోని గాయత్రి మాత గుడిలో వీరిరువురి వివాహం అగ్నిసాక్షిగా జరిగింది. ఈ వివాహం జరిగినట్టు జిల్లా అధికారులు కూడా ధృవీకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios