Asianet News TeluguAsianet News Telugu

తోటి విద్యార్థిని చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్న బాలుడు

విద్యార్థుల మద్య సరదాగా మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. క్లాస్ రూంలో ఇద్దరు విద్యార్థులు డబ్యూడబ్యూఎఫ్ లో మాదిరిగా కొట్టుకోవడంలో పోటీకి దిగి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

Students Fight In Coimbatore Fathima School Took A Life

విద్యార్థుల మద్య సరదాగా మొదలైన గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. క్లాస్ రూంలో ఇద్దరు విద్యార్థులు డబ్యూడబ్యూఎఫ్ లో మాదిరిగా కొట్టుకోవడంలో పోటీకి దిగి ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు. ఈ ఘటన తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోయంబత్తూరులోని ఫాతిమా స్కూల్లో పదో తరగతి విద్యార్థులు లంచ్ టైంలో సరదాగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ బలమైన విద్యార్థి కాస్త బలహీనంగా ఉన్న విద్యార్థితో గొడవకు దిగాడు. అయితే బలహీనంగా ఉన్న విద్యార్థి టేబుల్ పైకి ఎక్కి బలంగా ఉన్న విద్యార్థిపైకి దూకాడు. అయితే అతన్ని అమాంతం గాల్లోనే పట్టుకున్న విద్యార్థి  నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో  ఆ విద్యార్థి ఆచేతనంగా పడిపోయాడు. దీంతో మిగతా విద్యార్థులంతా కలిసి కిందపడిన విద్యార్థిని ఉపాధ్యాయుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ విద్యార్థి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

ఈ వార్త తెలిసి భయపడిపోయిన మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల కు దగ్గర్లోని బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

  

Follow Us:
Download App:
  • android
  • ios