Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో ఏకంగా ఐరన్ బస్ స్టాప్‌నే ఎత్తుకెళ్లిన దొంగలు.. ఏం జరిగిందంటే?

కర్ణాటకలో ఘరానా దొంగతనం చోటుచేసుకుంది. బెంగళూరులోని కన్నింగ్ హామ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇనుప బస్ స్టాప్‌ను కొందరు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు ఫైల్ చేశారు. నిందితుల కోసంసీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
 

steel structure new bus stop stolen in karnatakas bengaluru kms
Author
First Published Oct 5, 2023, 8:28 PM IST

బెంగళూరు: కర్ణాటకలో గజదొంగలు ఏకంగా ఐరన్ బస్ స్టాప్‌నే ఎత్తుకెళ్లారు. రూ. 10 లక్షల విలువైన ఇనుప నిర్మాణాన్ని ఎత్తుకెళ్లారు. విధాన సౌధకు ఒక కిలోమీటర్ దూరంలోనే నిర్మించిన ఈ నిర్మాణం రోజుల వ్యవధిలోనే అదృశ్యమవడం కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

బెంగళూరులో కన్నింగ్ హామ్ రోడ్డులో ఆగస్టు 21వ తేదీన ఓ ఇనుప బస్ స్టాప్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఈ బస్ స్టాప్‌ను నిర్వహిస్తున్నది. ఆగస్టు 28వ తేదీన మళ్లీ కన్నింగ్ హామ్ రోడ్డు వద్దకు వెళ్లినప్పుడు ఆ బస్ స్టాప్ అదృశ్యమైందని ఎన్ రవి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్ స్టాప్‌ను చోరీ చేశారని నిర్దారణకు వచ్చిన తర్వాత పోలీసులను ఆశ్రయించారు. 

Also Read: ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదు.. యూపీలో బుల్డోజర్‌తో రోడ్డును తవ్వేశారు

అంతకు ముందు అక్కడ పాత బస్ స్టాప్ ఉండేది. దాన్ని కూల్చివేసి కొత్తగా ఇనుప బస్ స్టాప్‌ను ఏర్పాటు చేశారు. కానీ, ఈ ఇనుప బస్ స్టాప్ కూడా మాయం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios