PM Modi: ప్రతి రాష్ట్రం తన బలాలను గుర్తించాలని.. అందుకు అనుగుణంగా లక్ష్యాలను నిర్ధారించుకొని వాటిని సాధించడానికి రోడ్మ్యాప్ తయారుచేసుకోవాలన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడానికి ఇది అత్యంత కీలకమని మోదీ పేర్కొన్నారు.
PM Modi: ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే భర్తీచేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బలాన్ని గుర్తించి, అందుకు తగిన లక్ష్యాలను నిర్ధారించుకొని వాటిని సాధించడానికి ప్రణాళికలు తయారుచేసుకోవాలని అన్నారు. ఇవి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు తోడ్పడుతాయని, లక్ష్యం పెట్టుకోని పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగిన ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సుకు ప్రధాని మొదటి మూడు రోజులు అధ్యక్షత వహించారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో శుక్రవారం ఈ సదస్సు జరిగింది.అధికారిక ప్రకటన ప్రకారం.. సదస్సు సందర్భంగా జరిగిన సెషన్లను ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ రంగాలకు సంబంధించిన ముసాయిదాను రూపొందించడంలో ఈ చర్చలు ఉపయోగపడతాయని అన్నారు.
ప్రతి రాష్ట్రం తన బలాన్ని గుర్తించాలని, దాని లక్ష్యాలను నిర్వచించుకోవాలని, దానిని సాధించడానికి ముసాయిదాను రూపొందించాలని ప్రధాని అన్నారు. భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఇది అవసరమని అన్నారు. 2024-25 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ఆలోచనను 2019లో ప్రధాని మోదీ ప్రతిపాదించారు. భవిష్యత్తులో అభివృద్ధి, ఉపాధి కల్పనలో పట్టణ ప్రాంతాలు కీలకం కానున్నాయని, అందుకే పట్టణ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
అన్ని ఖాళీల భర్తీ
దేశంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పీఎం-గతి శక్తిని సముచితంగా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని కోరారు. రాష్ట్రాలు ప్రతి ప్రాంతంలో ఖాళీలను గుర్తించి భర్తీ చేయాలి. అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలని, కేంద్రం, రాష్ట్రాల డేటా సెట్లను అనుసంధానించాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు.
కేంద్రం, రాష్ట్రాలు కలిసి టీం ఇండియాలా
కొత్త ఆలోచనలు, అమలు చేయదగిన అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. పనితీరు, మెరుగుదల, మార్పు ఈ కాలపు ఆవశ్యకమని ప్రధాని అన్నారు. టీం ఇండియాలా కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రాలు తమ శాఖలు, స్థానిక సంస్థల ద్వారా జరిగే కొనుగోళ్లకు జిఇఎమ్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని, దీని వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు.
అత్యవసర మందుల రవాణా, కొండప్రాంతాల పండ్ల ఉత్పత్తుల రవాణాకు డ్రోన్లను ఉపయోగించాలి. దానివల్ల రైతులు పండించే పంటలు, సేవా ఉత్పత్తులకు విలువను జోడించినట్లవుతుంది. జాతీయ విద్యా విధాన లక్ష్యాలను సాధించేందుకు, అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రధాని అన్నారు.
