తాను నడిపే విమానంలో... తల్లి, కొడుకు... ఆనందంలో పైలెట్...!
ఆ విషయాన్ని ఆయన చాలా ఎమోషనల్ గా పంచుకున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ఒకే విమానంలో ప్రయాణించడాన్ని చాలా స్పెషల్ గా ఫీలయ్యాడు.
ఇటీవల ఓ పైలెట్ తన కవితలతో తెగ పాపులర్ అయిన న్యూస్ చూసే ఉంటారు. కవిత రూపంలో ఎనౌన్స్మెంట్ ఇచ్చి... అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా.. తాజాగా... ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఈసారి విమానంలో... ఆయన తల్లి, తన కొడుకు కూడా ఉండటంతో... ఎమోషనల్ గా పోస్టు పెట్టాడు. ఆయన పేరు మోహిత్ టియోటియా. స్పైస్ జెట్ లో పైలెట్ గా వర్క్ చేస్తున్నాడు. ఆయన... విమానంలో ఎనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన నార్మల్ గా కాకుండా....కవిత రూపంలో ఇస్తూ ఉంటాడు. అలా ఫేమస్ అయ్యాడు. కాగా.... ఇటీవల... ఆయన తల్లి, కుమారుడు తాను నడిపే విమానంలో ఎక్కారట. ఆ విషయాన్ని ఆయన చాలా ఎమోషనల్ గా పంచుకున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ఒకే విమానంలో ప్రయాణించడాన్ని చాలా స్పెషల్ గా ఫీలయ్యాడు.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను మోహిత్ టియోటియా ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. అతను యాప్లో పొయెటిక్ పైలట్ అనే పేజీని కలిగి ఉన్నాడు. "జమీన్ సే ఊపర్, ఖూబ్సూరత్ హోగా అస్మాన్. అలాగే, కిసీ భీ ఆపత్కలిన్ స్థితి మెయిన్, రఖీన్ అప్నీ బీవీ కా ధ్యాన్, క్యుకీ అగర్ నజర్ భాత్కీ తో చలా శక్తి హై తీర్ కమాన్," అని ఆయన ప్రకటన సమయంలో విన్నారు. క్లిప్లో ప్రయాణీకులు అతనిని ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టడం కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు.
అంతేకాకుండా, తన తల్లి, కొడుకు తనతో మొదటిసారి ప్రయాణిస్తున్నందున ఈ విమానం తనకు చాలా ప్రత్యేకమైనదని అతను పేర్కొన్నాడు. వాళ్లని కూడా నవ్వించే విధంగా పరిచయం చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.