Asianet News TeluguAsianet News Telugu

వ్యక్తిగత సహాయకుడి భార్యగా సోనాలి ఫోగట్‌ పేరు.. ఆ డాక్యూమెంట్స్‌లో సంచలన విషయాలు..!

బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆమె గోవాలో మరణించగా.. తొలుత గుండెపోటుతో చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే తర్వాత అది హత్య కేసుగా మారింది. తాజాగా ఆమెకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Sonali Phogat Death Case she named as her personal assistant wife in rent documents reports
Author
First Published Aug 27, 2022, 10:56 AM IST

బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆమె గోవాలో మరణించగా.. తొలుత గుండెపోటుతో చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే తర్వాత అది హత్య కేసుగా మారింది. తాజాగా ఆమెకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఓ అపార్టమెంట్ రెంట్ డాక్యూమెంట్స్‌లో.. సోనాలి ఫోగట్ ఆమె వ్యక్తిగత సహాయకుడు సుధీర్ సాంగ్వాన్ భార్య‌ అని ఉందని సోర్సెస్‌ను ఉటంకిస్తూ ఇండియా టూడే కథనంలో పేర్కొంది. 

సోనాలి ఫోగట్ సెక్టార్ 102లోని గుర్గావ్ గ్రీన్స్‌లోని అపార్ట్‌మెంట్‌‌‌ను కూడా నివాసానికి వినియోగిస్తున్నారు. సోనాలి ఫోగట్ గోవాకు బయలుదేరే ముందు.. ఆమె వ్యక్తిగగత సహాయకుడితో కలిసి ఫ్లాట్‌కు వచ్చిందని, అనంతరం క్యాబ్‌లో విమానాశ్రయానికి వెళ్లారని ఆ వర్గాలు తెలిపాయి. గుర్గావ్ గ్రీన్స్‌లో సోనాలి ఫోగట్ అద్దెకు తీసుకున్న ఫ్లాట్ కృష్ణకాంత్ తివారీకి చెందినది. ఫ్లాట్ అద్దెకు తీసుకున్నప్పుడు పోలీసు వెరిఫికేషన్ కూడా జరిగింది.

సోనాలి ఫోగట్ మృతికి సంబంధించి కేసులో.. ఆమె ఇద్దరు సహాయకులు సుధీర్ సాంగ్వాన్, సుఖ్‌విందర్ వాసిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె మృతికి గల అసలైన కారణం ఇంకా తెలియరాలేదు. మరోవైపు సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు కూడా ఆమె మృతి వెనక నిందితుల హస్తం ఉన్నట్టుగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోనాలి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో ఏముందంటే..
సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆమె మృతదేహానికి గురువారం పోస్టుమార్టమ్ నిర్వహించారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ ప్రకారం.. ఆమె శరీరంపై పలుచోట్ల మొద్దుబారిన గాయాలు ఉన్నట్టుగా తేలింది. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌ అనంతరం గోవా పోలీసులు సోనాలి ఫోగట్ మృతిపై హత్య కేసు నమోదు చేశారు. సోనాలి ఫోగట్ డ్రింక్‌లో ఎండీఎంఏ ఎక్కువగా ఉందని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పార్టీకి ముందు బాటిల్‌లో 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపినట్లు, ఆ బాటిల్‌‌లోని పానీయాన్ని సోనాలి ఫోగట్ తాగినట్లు నిందితులు అంగీకరించారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. సోనాలి ఫోగట్ అతికష్టం మీద సుధీర్ సాంగ్వాన్ సాయంతో రెస్టారెంట్‌లో నడుస్తూ కనిపించారు. ఇక, మరో నిందితుడు సుఖ్‌విందర్ వాసి కూడా సంఘటన స్థలంలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

‘‘ఉదయం 4.30 గంటలకు ఆమె నియంత్రణలో లేనప్పుడు.. అనుమానితుడు ఆమెను టాయిలెట్‌కి తీసుకెళ్లాడు. వారు రెండు గంటలపాటు ఏమి చేశారో వివరణ లేదు. ఇద్దరినీ అరెస్టు చేశాం. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం వారిని వివిధ ప్రాంతాలకు తీసుకువెళుతుంది. ఇద్దరిని త్వరలో కోర్టులో హాజరు పరుస్తామని.. ఈ డ్రగ్స్‌ తాగి ఆమె మరణించినట్లు తెలుస్తోంది’’ అని గోవా ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఓంవీర్‌ సింగ్‌ బిష్ణోయ్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios