Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ ఖిన్వ్‌సర్ కోటలో స్మృతీ ఇరానీ కుమార్తె వివాహం నేడే..కాబోయే అల్లుడు ఎవరంటే...

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్లే ఇరానీ,అర్జున్ భల్లాల వివాహం నేడు అంగరంగ వైభవంగా జరుగనున్నది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని ఖిన్వ్‌సర్ కోట ..ఈ హై ప్రొఫైల్ వివాహానికి వేదికగా మారింది.

Smriti Irani's Daughter To Get Married In Rajasthan Fort On Thursday
Author
First Published Feb 9, 2023, 1:46 AM IST

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి తర్వాత రాజస్థాన్‌లో మరో హైప్రొఫైల్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. జోధ్‌పూర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని నాగౌర్ జిల్లాలోని ఖిన్వ్‌సర్ కోటలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్ , అర్జున్ భల్లాల వివాహం జరుగనున్నది.

ఈ వేడుకలో భాగంగా ఇప్పటికే హల్దీ,మెహందీ వేడుకలు ప్రారంభమయ్యాయి.ఫిబ్రవరి 9న షనైల్ ఇరానీ, అర్జున్ భల్లాలు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు.ఇదిలాఉంటే.. స్మృతి ఇరానీకి అల్లుడు కాబోతున్న ఈ అర్జున్ భల్లా ఎవరో తెలుసుకోవాలని అంతా అనుకుంటున్నారు. అతని కోసం నెట్టింట్లో వెతుకుతున్నారు.  

అర్జున్ భల్లా ఎవరు?

స్మృతి ఇరానీకి కాబోయే అల్లుడు అర్జున్ భల్లా.. అతడో ఎన్నారై. అతను MBA డిగ్రీ హోల్డర్,అతను తన కుటుంబంతో కెనడాలో నివసిస్తున్నాడు. అర్జున్ భల్లాకు అతని తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నారు. నివేదికల ప్రకారం.. అర్జున్ కెనడాలోని సెయింట్ రాబర్ట్స్ కాథలిక్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించాడు. అతను లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో LLB పూర్తి చేశారు. 

జోధ్‌పూర్ చేరుకున్న స్మృతి ఇరానీ 

స్మృతి ఇరానీ కూతురు షనీల్ పెళ్లి కోసం ఖిన్వ్సర్ ఫోర్ట్‌ను 3 రోజుల పాటు బుక్ చేసుకుంది. బుధవారం ఆమె జోధ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో, జుబిన్ ఇరానీ కుమార్తె వివాహ సన్నాహకాల కోసం మంగళవారం మధ్యాహ్నం జోధ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ జంట వివాహ ఆచారాలు ఫిబ్రవరి 8 నుండి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 9న వివాహ వేడుక ఘనంగా జరుగనున్నది.  ఈ వివాహం కుటుంబంలోని చాలా ప్రత్యేకమైన వ్యక్తులు మధ్య జరుగనున్నది.పెళ్లికి కేవలం 50 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు.  

500 సంవత్సరాల నాటిది

జోధ్‌పూర్ స్థాపకుడు రావ్ జోధా యొక్క ఎనిమిదవ కుమారుడు రావ్ కరంజీ 1523లో ఖిన్వ్‌సర్‌లో తన రాజ్యాన్ని స్థాపించాడు. ఖిన్వ్సార్ కోట ప్రధాన వివాహ గమ్యస్థానంగా , షూటింగ్ గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందింది. దీని 500 సంవత్సరాల నాటి ఇంటీరియర్ ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్షయ్ కుమార్,సోనాక్షి సిన్హా నటించిన హాలిడే సినిమా కోసం ఇక్కడ ఒక పాటను చిత్రీకరించారు.

2021లో నిశ్చితార్థం 

ఈ జంట నిశ్చితార్థం 2021,డిసెంబర్ నెలలో జరిగింది. స్మృతి ఇరానీ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో వారికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ కూతురు షనైల్ ఇరానీ.అర్జున్ భల్లాల నిశ్చితార్థం గురించి తెలియజేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios