గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన సందర్భంలో ఆరుగురు కార్మికులు పనిచేస్తున్నారు. వారు అక్కడిక్కడే మృతి చెందారు. 

గుజరాత్ : gujaratలోని బారుచ్ జిల్లాలో భారీ పేలుడు జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఓమ్ ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్ కు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్ ఇండస్ట్రియల్ పార్కులోని కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు జరిగింది. ఆ సమయంలో ఆరుగురు కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా పనిలో నిమగ్నమైన సమయంలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. డెడ్ బాడీస్ ను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పేలుడుకు కారణమేంటి? ఓమ్ ఆర్గానిక్ యాజమాన్యం నిర్లక్షమేమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, గతేడాది ఆగస్టులో కూడా ఇదే పారిశ్రామిక వాడలోని మరో రసాయన కంపెనీలో పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.