తమిళనాడు చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
తమిళనాడు రాష్ట్రంలో బుధవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. టాటా ఏస్ వాహనం మరో రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టులో బుధవారంనాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా మధురాండకం వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై టాటా ఏస్ వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టిందిఅయితే అదే సమయంలో టాటా ఏస్ వాహనాన్ని వెనక నుండి వచ్చి మరో వాహనం ఢీకొట్టింది. రెండు వాహనాల మధ్య టాటా ఏస్ వాహనం ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనంలోని ఆరుగురు మృతి చెందారు.
అన్నామలైయార్ కార్తీక దీపోత్సవానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఈ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మృతదేహాలను చెంగల్పట్టు ప్రబుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహలను బంధువులకు అప్పగించనున్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో శేఖర్, శశికుమార్, యెహుమలై, చంద్రశేఖర్, దామోదరన్, గోకుల్ లు మృతి చెందారు.ఈ ప్రమాదంలో అయ్యనార్, రామ్మూర్తి, రవి, శేఖర్, సతీష్ కుమార్ లు గాయపడ్డారు.