Asianet News TeluguAsianet News Telugu

బీహార్ లో పరువు హత్య : చెల్లితో సన్నిహితంగా ఉన్నాడని, చంపి, ముక్కలు చేసి.. కుక్కలకు ఆహారంగా వేశాడు..

బీహార్ లో పరువు హత్య కలకలం రేపింది. సోదరి ప్రియుడిని చంపి, ముక్కలుగా నరికాడో యువకుడు.. ఆ తరువాత వాటిని కుక్కలకు ఆహారంగా వేశాడు. 

sisters boyfriend was killed and chopped body into pieces and fed to the dogs In bihar
Author
First Published Dec 27, 2022, 6:49 AM IST

బీహార్ : బీహార్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తమకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందనో, కులం, మతం కాని వ్యక్తిని ఇష్టపడిందనో..సామాజికంగా తక్కువ హోదాలో ఉన్న వారిని ప్రేమించారనో.. కులంలో తమ పరువు పోతుందని.. కన్నవారిని, తోడబుట్టిన వారిని అత్యంత పాశవికంగా ప్రేమించిన వ్యక్తితో కలిసి చంపే ‘ పరువు హత్య’ల వరుసలో మరో హత్య చేరింది. బీహార్లోని నలందలో ఇది జరిగింది. తన చెల్లెలు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించిందని ఆ వ్యక్తిని చంపేశాడు ఓ అన్న. ఈ పరువు హత్య కలకలం రేపింది. చంపేయడంతో అతడు కసి తీరలేదు.

చంపేసిన తర్వాత అతడి మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. తరువాత వాటిని కుక్కలకు ఆహారంగా వేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… డిసెంబర్ 16వ తేదీన బిట్టు కుమార్ అనే యువకుడు ఇంట్లో నుంచి బయటికెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో తెల్లారి వస్తాడులే అనుకున్నారు. అప్పటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కుమార్ కోసం అంతటా వెదికారు. తెలిసిన వారందరినీ అడిగారు.  కానీ బిట్టూ కుమార్ ఆచూకీ తెలియలేదు. 

టీ తోటలో గ్రెనేడ్లు, ఆయుధాలు.. భయాందోళనలో స్థానికులు..

దీంతో డిసెంబర్ 18వ తేదీన వారు పోలీసులను ఆశ్రయించారు. బిట్టూ కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా వారికి రాహుల్ అనే వ్యక్తి పై అనుమానం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ ని విచారించడంతో భాగంగా అతడిని తనిఖీ చేయగా.. అదృశ్యమైన బిట్టూ కుమార్ ఫోన్ అతడి దగ్గర ఉంది. ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

ఆ తర్వాత రాహుల్ మీద అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో రాహుల్ నేరాన్ని అంగీకరించాడు. బిట్టూ కుమార్ తో తన సోదరి సన్నిహితంగా ఉందని.. అది చూసి తట్టుకోలేకపోయాను అని  చెప్పుకొచ్చాడు. అందుకే డిసెంబర్ 16వ తేదీన ఏదో సాకుతో బిట్టూ కుమార్ ను నిర్మానుష్య ప్రదేశానికి వచ్చేలా చేశానని..  అక్కడే ప్రాణాలు తీశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చెప్పింది విని పోలీసులు షాక్ అయ్యారు. చంపేసిన తరువాత బిట్టూ కుమార్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. కుక్కలకు ఆహారంగా వేశానని చెప్పారు. మిగతా శరీరభాగాలను నదిలో పడేశానని చెప్పుకొచ్చాడు.

Follow Us:
Download App:
  • android
  • ios