సిసోడియా ఒక క్రిమినల్ అని, ఆయన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ఢిల్లీ బీజేపీ కోరింది. ఈ మేరకు మనీష్ సిసోడియా ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ ఎలాన్ మస్క్ కు విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ఢిల్లీ బీజేపీ ఎలాన్ మస్క్ ను కోరింది. సిసోడియా క్రిమినల్ అని, ఆయన తరఫున మరొకరు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ను ఉపయోగిస్తున్నారని ఢిల్లీ బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆరోపించారు. ప్రస్తుతం జైలులో ఉన్నందున ఆప్ నేత ఖాతాను బ్లాక్ చేయాలని ఎలన్ మస్క్ కు బగ్గా విజ్ఞప్తి చేశారు.

మహిళా జడ్జీకే వేధింపులు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్

సరైన ఆధారాలు లేకుండా తనను అరెస్టు చేసి మద్యం పాలసీ కేసులో ఇరికించారని అధికార బీజేపీని విమర్శిస్తూ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండిల్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ బగ్గా ఈ విధంగా పేర్కొన్నారు. దేశంలో పాఠశాలలు తెరిచిన వారిని వారు (బీజేపీ) జైలుకు పంపుతున్నారని అందులో సిసోడియా పేర్కొన్నారు. అయితే జైలులో ఉన్న సమయంలో ఆ అకౌంట్ నుంచి ట్వీట్ రావడం ఆసక్తికరంగా మారింది.

Scroll to load tweet…

‘‘దేశంలో స్కూళ్లు తెరిస్తే జైళ్లు మూతపడతాయని ఈ రోజు వరకు విన్నాను. కానీ ఇప్పుడు వీరు దేశంలో పాఠశాలలు తెరిచిన వారిని మాత్రమే జైల్లో పెట్టడం ప్రారంభించారు’’ అని సిసోడియా ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ వచ్చింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆప్ సీనియర్ నేతకు మార్చి 20 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.

సిసోడియా భద్రతపై బీజేపీ, ఆప్‌ల మధ్య మాటల యుద్ధం
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సిసోడియా భద్రతపై బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ జైలులో ఉన్న సిసోడియా ప్రాణాలకు ముప్పు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ బుధవారం ఆరోపించారు. సిసోడియాను జైల్లో ఇతర ఖైదీలతో ఉంచుతున్నారని, ఆయనకు విపాసన సెల్ ను నిరాకరించారని ఆప్ నేతలు ఆరోపించారు. ‘‘మనీష్ సిసోడియాను జైలులోని విపాసన సెల్ లో ఉంచాలని అభ్యర్థన వచ్చింది. దానికి కోర్టు ఆమోదం తెలిపింది. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ సిసోడియాను జైలు నంబర్ 1లో నేరస్థుల వద్ద ఉంచారు. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి’’ అని ఆప్ ఎమ్మెల్యే భరద్వాజ్ డిమాండ్ చేశారు.

సొంత పార్టీ నేతను జైల్లో పెట్టించారు.. వాళ్లకు మద్ధతిస్తారా : శరద్‌పవార్‌పై ఒవైసీ ఆగ్రహం

అయితే ఆప్ ఆరోపణలను తీహార్ జైలు అధికారులు తోసిపుచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రిని తీహార్ సెంట్రల్ జైలు నంబర్ 1 లోని ఒక వార్డులో ఉంచామని, అక్కడ తక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారని, గ్యాంగ్ స్టర్ లు లేరని జైలు యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. మనీష్ సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వార్డుకు కేటాయించినట్లు పేర్కొంది. ఇక్కడ ఉన్న వారంతా తక్కువ సంఖ్యలో ఖైదీలో ఉన్నారని, వీరంతా గ్యాంగ్ స్టర్లు కారని తెలిపింది. ఇక్కడున్నవారు సత్ప్రవర్తన కలిగిన వారేనని పేర్కొంది.

‘‘ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా ధ్యానం, ఇతర కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఉంటుంది. జైలు నిబంధనల ప్రకారం ఆయన భద్రతకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఆయన నివాసాలపై వస్తున్న అనుమానాలు నిరాధారమైనవి’’ అని ఓ అధికారి తెలిపారని ‘జీ న్యూస్’ నివేదించింది.