బిడ్డకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం ఉంది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు కూడా లేవని వైద్యులు తెలిపారు
కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా సోమవారపేటలో వింత శిశువు జన్మించింది. శిశువు జన్మనిచ్చిన కాసేపటికే మరణించడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారపేటకు చెందిన జీకే మూర్తి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య చిన్నమ్మ నిండు గర్భిణి.
Add Asianetnews Telugu as a Preferred Source

సోమవారం రాత్రి ఆమెకు సడెన్ గా నొప్పులు రావడంతో శనివారసంతేలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె వింత శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే శిశువు మరణించింది. బిడ్డకు ఒకటే కాలు ఉంది, వెనుక తోక లాంటి భాగం ఉంది. ఆడ, మగో తెలుసుకోవడానికి జననాంగాలు కూడా లేవని వైద్యులు తెలిపారు
