విమానం ఇంజిన్ లో మంటలు రావడంతో.. అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. 


విమానం ఇంజిన్ లో మంటలు రావడంతో.. అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... తిరుచ్చిరాపల్లి నుంచి సింగపూర్ బయలుదేరిన టీఆర్ 567 స్కూట్ విమానం ఇంజిన్ లో మంటలు వ్యాపించాయి. వెంటనే గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అధికారుల అనుమతితో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌చేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు భయపడిపోయారు. 

సిబ్బంది సహా 170 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు నిపుణులు విమానాన్ని పరిశీలిస్తున్నారు. క్షుణ‍‍్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ సాయంత్రానికి ఈ విమానం తిరిగి సింగపూర్‌ బయలు దేరనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తగిన వసతి సదుపాయాలను కల్పించినట్టు అధికారులు తెలిపారు.