Asianet News TeluguAsianet News Telugu

Shivamogga: ముస్లిం గూండాల వ‌ల్లే  శివమొగ్గలో మత ఉద్రిక్తత.. బీజేపీ సీనియ‌ర్ నేత సంచ‌ల‌న‌ ఆరోపణలు

Shivamogga: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్‌ నేత ఈశ్వరప్ప మంగళవారం శివమొగ్గలో మతపరమైన ఉద్రిక్తతలను కొందరు ముస్లిం గూండాలు ఆరోపిస్తూ, హిందూ సమాజాన్ని బలహీనంగా భావించవద్దని, మొత్తం సమాజం ఏకతాటిపై నిలబడితే వారు మనుగడ సాగించరని హెచ్చరించాడు.

Shivamogga BJP Eshwarappa warns Muslim community against anti-national activities
Author
Hyderabad, First Published Aug 17, 2022, 4:32 AM IST

Shivamogga:  శివమొగ్గలో కొందరు ముస్లిం గూండాలు మతపరమైన ఉద్రిక్తతను సృష్టించిస్తున్నారనీ, హిందూ సమాజాన్ని బలహీనంగా పరిగణించరాదని, మొత్తం సమాజం కలిసి నిలబడితే వారు మనుగడ సాగించరని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్‌ నేత ఈశ్వరప్ప హెచ్చరించారు.
 .
హిందువుల సహనాన్ని పరీక్షించవద్దనీ,  దారి తప్పుతున్న ముస్లిం యువతను నియంత్రించండని  ముస్లిం మత పెద్దలకు సూచించారు.  షిమోగాలో వీరసావర్కర్‌ ఫ్లెక్సీ వివాదం తదనంతర ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. ముస్లిం గూండాల తీరు మారడం లేదని, ఇలా అయితే కొరడా ఝళిపించకతప్పదని హెచ్చ‌రించారు. సోమవారం రాత్రి ముస్లిం గూండాలకు షిమోగా పోలీసులు కాల్పుల ద్వారా  శాంపిల్‌ రుచిచూపారని, అయితే ఇప్పటికీ ఇలాంటి గూండాయిజం, హత్యలు కొనసాగుతున్నాయని అన్నారు. 

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, హిందువులు, ముస్లింలు అందరూ ఇలాంటి పనుల్లో పాలుపంచుకుంటున్నారని తాను అనడం లేదని ఈశ్వరప్ప అన్నారు. హిందూ సమాజం బలంగా ఉంది, బలహీనమైనది కాదు. హిందూ సమాజం నిజంగా నిలబడితే, ముస్లిం గూండాలు తప్పించుకోలేరు, కానీ హిందువులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఇష్టపడరు, ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటార‌ని అన్నారు.


ముస్లింలందరూ గూండాలు అని తాను అనడం లేదని ముస్లిం సమాజంలోని పెద్దలకు చెప్పాలనుకుంటున్నానని అన్నారు. గతంలో శాంతి భద్రతల కోసం ముస్లిం సంఘం పెద్దలు కృషి చేశారని, గూండాయిజం చేస్తున్న యువతకు బుద్ధి చెప్పాలని, అలా జరగకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. 
 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు శివమొగ్గలో  హిందుత్వ సిద్ధాంతకర్త విడి సావర్కర్ చిత్రంతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో రెండు గ్రూపుల మధ్య  వివాదం తలెత్తింది. ఈ క్ర‌మంలో ప్రేమ్ సింగ్ అనే యువకుడిని కొందరు దుండగులు కత్తితో పొడిచారు.

శివమొగ్గలో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఈశ్వ‌ర‌ప్ప‌ చెప్పారు. జిల్లా కేంద్రమైన పట్టణం నేడు ప్రశాంతంగా ఉందని, అయితే ఇలాంటి హత్యాయత్నాలు కొంతమంది ముస్లిం గూండాలు, ఎస్‌డిపిఐ (సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా) ఆలోచనా ధోరణిలో మార్పు రాలేదని నిరూపిస్తున్నాయని అన్నారు.  

శివమొగ్గ ప్రజలు శాంతి ప్రేమికులని, హిందువులు, ముస్లింలు చాలా కాలంగా అన్నదమ్ముల్లా జీవిస్తున్నారని అన్నారు. తాను అక్కడి నుంచి చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్నానని, అయితే ఇటీవలి కాలంలో బయటి నుంచి లేదా కేరళ నుంచి వచ్చి కొన్ని దేశ వ్యతిరేక సంస్థల కార్యకలాపాలు పెరిగిపోయాయని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఈశ్వరప్ప అన్నారు.

కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని, అలాంటి చర్యలకు పాల్పడిన పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను కోరారు. ఎస్‌డిపిఐకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్లే శివమొగ్గలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios