Shiv Sena Saamana: అన్పార్లమెంటరీ మాటలపై ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది. నూతన 'అన్పార్లమెంటరీ' పదాల జాబితాపై దేశవ్యాప్తంగా ఉద్రిక్తత ఏర్పడిందని శివసేన పేర్కొంది.
Shiv Sena Saamana: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ పార్లమెంటరీ పదాలపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నాయి. విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి కొన్ని పార్టీలు వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నాయి. ఈ తరుణంలో శివసేన అధికారిక పత్రిక సామ్నా( Shivsena Mouthpiece Saamana) అన్పార్లమెంటరీ పదాల జాబితా ప్రకటనపై తనదైన శైలిలో విమర్శించింది. నూతన 'అన్పార్లమెంటరీ' పదాల జాబితాపై ఉద్రిక్తత ఏర్పడిందని శివసేన పేర్కొంది.
అసలు అన్పార్లమెంటరీ పదాలంటే ఏమిటని శివసేన ప్రశ్నించింది. అవినీతిని.. అవినీతి అనవద్దా? అయితే.. ప్రత్యామ్నాయ పదం ఏమిటి? అని ప్రశ్నించింది. నియంతకు మరో సారూప్యత పదం ఏమిటి? బీజేపీ .. మహారాష్ట్రలో ఢిల్లీ ద్రోహాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నియంతృత్వంపై పార్లమెంటులో గళం విప్పే సమయంలో సభ్యులు తమ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తం చేయాలి? ప్రత్యర్థుల నాలుక కరుచుకుని రాజ్యాంగం, స్వాతంత్య్ర చితిపై నిలబడ్డారు. ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుదామని మాట్లాడే పార్టీ .. ఈ రోజు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛలపై పార్లమెంటరీలో దాడి చేసిందనీ, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలని విమర్శించింది. 'అడవిలో తిరుగుబాటుదారులు ఉన్నారు, పార్లమెంటులో దొంగలు ఉన్నారు. రెబల్స్ అంటే అడవిలో తిరుగుబాటుదారులు, డకాయిట్లు పార్లమెంటులో కలుస్తారు' అని సామ్నా పత్రిక పేర్కొంది.
ఒకవైపు పార్లమెంటు సభ్యులపై 'అన్పార్లమెంటరీ' పదాల ఆంక్షలు పెట్టి, మరోవైపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ధర్నా, నిరాహారదీక్ష, ఆందోళనలను నిషేధించింది. పార్లమెంట్లో ఏం మాట్లాడినా.. మేము చెప్పినట్లే ప్రవర్తించాలనడం సరికాదని పేర్కొంది. ఇలాంటి నియంతృత్వ పాలనలో ప్రతిదీ తుంగలో తొక్కబడుతుందని, ప్రజాస్వామ్యం అశోక స్థంభం మీద సింహం గర్జించేలా ఉండాలి, కానీ ప్రస్తుత పాలకులు గగ్గోలు పెట్టి పార్లమెంటును పిరికిపందలా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అన్ పార్లమెంటరీ పదాల గురించి రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారని సామ్నాలో చెప్పబడింది. 'నాపై చర్యలు తీసుకోండి, నన్ను సస్పెండ్ చేయండి, నేను ఈ పదాన్ని ఉపయోగిస్తూనే ఉంటాను, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటాను' అని తృణమూల్ కాంగ్రెస్ నేత ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పష్టంగా చెప్పారు. దేశ రాజకీయాల్లో, నేటికీ సమాజంలో జైచంద్, శకుని వంటి వారు ఉన్నారని, వారందరూ సామాజిక బాధ్యత వహిస్తారని, అయినా.. జైచంద్, శకుని వంటి చారిత్రక పదాలను బీజేపీ ఎందుకు బహిష్కరించింది. శకుని లాంటి మోసం-కుట్ర అడుగడుగునా కనిపిస్తున్నప్పుడు.. దేశాన్ని దోచుకునే శకునిలపై దాడి చేయకపోవడమే ఉగ్రదాడి అని విమర్శించింది.
పాలకులు ప్రజాప్రతినిధులనే దేశద్రోహానికి పాల్పడుతున్నారనీ, బధిరులు, చెవిటివారు, వికలాంగులుగా ఎలా ఉంటారో, అలాగే చెవిటి, గుడి పరిస్థితి పార్లమెంట్గా మర్చాలని అధికార బీజేపీ భావిస్తుందనీ, దేశంలో గందరగోళం సృష్టిస్తుందని విమర్శించారు. అయినా.. నేటికీ సుప్రీంకోర్టులో కొంత న్యాయం సజీవంగా ఉందనీ, దేశంలోనే అతిపెద్ద న్యాయవ్యవస్థ పార్లమెంటు అని వర్ణించింది.
ప్రజాస్వామ్యం అశోక స్థంభం మీద సింహం గర్జించేలా ఉండాలి, కానీ ప్రస్తుత పాలకులు బయట గర్జిస్తూ.. పార్లమెంటును పిరికిపందలా మర్చుతున్నారని మండిపడింది. హరిశంకర్ పర్సాయి మాట్లాడుతూ.. 'నియంత పిరికివాడు. నాలుగు గాడిదలు కలిసి మేస్తున్నా కూడా భయపడిపోతాడు. మాపై కుట్ర జరుగుతోందని’ నేటి రాజకీయ చిత్రం.. అందుకు భిన్నంగా లేదు! అని అన్నారు.
