Sharad Pawar: పాకిస్థాన్ లో నివసిస్తున్న సామాన్య పౌరులు భారత్కు శత్రువులు కాదని, సైన్యం సహాయంతో అధికారం కోరుకునే వారు, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే వారే నిజమైన శత్రువులని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం అన్నారు. ఇమ్రాన్ఖాన్ పేరు చెప్పకుండానే.. ఓ యువకుడు పాకిస్థాన్ పగ్గాలు చేపట్టి.. ఆ దేశానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నించి.. అధికారం కోల్పోవల్సివచ్చిందని అన్నారు.
Sharad Pawar: పాకిస్థాన్లోని సామాన్య ప్రజలు భారత్కు శత్రువులు కాదని, సైన్యం సహాయంతో అధికారం కోరుకునే వారే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు అనుకూలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం అన్నారు. ఇమ్రాన్ఖాన్ పేరు చెప్పకుండానే.. ఓ యువకుడు పాకిస్థాన్ పగ్గాలు చేపట్టి.. ఆ దేశానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నించి.. అధికారం నుంచి తప్పుకున్నాడని కూడా చెప్పాడు. పూణెలోని కొంధ్వా ప్రాంతంలో జరిగిన ఈద్-మిలాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్లోని యుద్ధ భయానక పరిస్థితి గురించి, శ్రీలంకలో నెలకొన్న అశాంతి గురించి ప్రస్తావించారు. నేడు ప్రపంచంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని, రష్యా వంటి శక్తివంతమైన దేశం ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై దాడి చేస్తోందని, శ్రీలంకలో యువకులు రోడ్డెక్కి పోరాడుతున్నారని, ఆ దేశ నాయకులు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారని వాపోయారు. అలాగే.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. పొరుగున ఉన్న పాకిస్థాన్లో ఓ యువకుడు ప్రధాని పగ్గాలు చేపట్టి.. దేశానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నించి, చివరకు తన అధికారాన్ని కోల్పోయాడని, అక్కడ భిన్నమైన పరిస్తితి కనిపిస్తోందని అన్నారు. ఇటీవలే పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం కారణంగా ప్రధాని పదవిని కోల్పోవల్సి వచ్చిన విషయం తెలిసిందే.
తాను కేంద్ర మంత్రిగా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా అనేక సార్లు పాకిస్తాన్ను సందర్శించినట్లు పవార్ చెప్పారు. "లాహోర్, కరాచీ కావచ్చు, మేము ఎక్కడికి వెళ్లినా, ఘన స్వాగతం లభించింది. మేము మా క్రికెట్ జట్టుతో కలిసి ఒక మ్యాచ్ కోసం కరాచీకి వెళ్ళాము. మ్యాచ్ ముగిసిన ఒక రోజు తర్వాత, ఆటగాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్రదేశాలను చూడాలని తమ కోరికను వ్యక్తం చేశారు ... మేము వెళ్ళాము. అక్కడ ఓ రెస్టారెంట్కి వెళ్లి అల్పాహారం తీసుకున్న తర్వాత, మేము బిల్లు చెల్లించడానికి ప్రయత్నించినప్పుడు, రెస్టారెంట్ యజమాని డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు , మేము వారి అతిథులమని చెప్పాడు," అని అతను చెప్పాడు. పాకిస్థాన్లోని సామాన్య ప్రజలు భారత్కు శత్రువులు కాదని పవార్ అన్నారు.
"(పాకిస్థానీ) సైన్యం సహాయంతో రాజకీయాలు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకునే వారు.. సంఘర్షణను ఇష్టపడతారని అన్నారు. స్వాతంత్ర పోరాట నాయకులు ఐక్యంగా ఉన్నందున బ్రిటీష్ పాలకులు భారత్ ను వీడిచి వెళ్లిపోయారని తెలిపారు. ఎవరైనా వర్గాల మధ్య విద్వేషం సృష్టించడానికి ప్రయత్నిస్తే.. అందరూ కలిసి వచ్చి అలాంటి వారికి గుణపాఠం చెప్పాలని పవార్ పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే.. ఎన్సిపి చీఫ్ శరద్ పవార్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహారాష్ట్ర యూనిట్ ఎడిట్ చేసి, ఆయన హిందూ వ్యతిరేకి అని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన శరద్ పవార్ బిజెపిని టార్గెట్ చేశారు. బిజెపిని ఉద్దేశించి పవార్ మాట్లాడుతూ.. కార్మికవర్గం యొక్క బాధలను ఎత్తి చూపే కవిత్వంలోని పంక్తులు రాశానని, అయితే.. బీజేపీ మాత్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయాలనుకునే సిద్ధంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP రాష్ట్ర విభాగం (@BJP4Maharashtra) బుధవారం సతారాలో పవార్ చేసిన ప్రసంగం యొక్క వీడియోను విడుదల చేసింది. "నాస్తికుడైన శరద్ పవార్ ఎప్పుడూ హిందూ మతాన్ని ద్వేషిస్తారని, హిందూ దేవతలను అవమానించకుండా. రాజకీయ విజయం సాధించలేరని వీడియోలో ఉంది.
ఈ ఘటనపై పవార్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ, రాథోడ్ కవిత 'పాథర్వత్' (స్టోన్ కట్టర్)లోని కొన్ని పంక్తులను ప్రస్తావించనని తెలిపారు. కులతత్వంపై జవహర్ రాథోడ్ రాసిన కవితను పవార్ ప్రస్తావించారని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయంగా మారింది.
