Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : పది రూపాయల కోసం ఇద్దరి మీద, ఏడు రౌండ్ల కాల్పులు..

పదిరూపాయల కోసం కాల్పులకు తెగబడ్డాడో వ్యక్తి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు ఏడురౌండ్ల కాల్పులు జరిపినట్టు సమాచారం. 

Seven rounds of firing on two for ten rupees in jharkhand
Author
First Published Jan 17, 2023, 8:30 AM IST

జార్ఖండ్ : జార్ఖండ్లోని పలమూ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 10 రూపాయల కోసం తుపాకితో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తిని సోనూ సోనిగా గుర్తించారు. ఈ కాల్పులకు కారణం 10 రూపాయలుగా తేలడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి పెడితే.. కాల్పులు జరిపిన సదరు నిందితుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి.. వినయ్ గుప్తా అనే వ్యక్తికి చెందిన మద్యం దుకాణానికి వచ్చాడు. అక్కడ వారు మందు బాటిళ్లు కొన్నారు.

అయితే,  బాటిల్ మీద  ఉన్న ధర కంటే..  బాటిల్ కు ఎక్స్ ట్రా రూ.10 ఇవ్వాలని  వినయ్ నిందితుడిని అడిగాడు. దానికి నిందితుడు ఒప్పుకోకపోవడంతో ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. దీంతో సోనూ వినయ్ తో గొడవపడ్డాడు. అయితే, అక్కడే ఉన్న వినయ్ సోదరులు అతడికి మద్దతుగా వచ్చారు. ఈ గొడవతో కోపానికి వచ్చిన సోనూ సోని.. వినయ్ అతని సోదరులపై తన దగ్గరున్న తుపాకీతో ఏడు రౌండ్లు కాల్పులు జరిపాడు. 

చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే ఈ ఘటన మీద పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, సోనూ సోని పాత నేరస్తుడే అని.. ఇప్పటికే  పలుకేసుల్లో అతను నిందితుడుగా ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. 

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన బ్యాగ్ లో అరుదైన వన్య ప్రాణుల గుర్తింపు..

ఇదిలా ఉండగా, జనవరి 5న మధ్యప్రదేశ్ లో  దారుణ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఇంటి ముందు మూత్రం పోస్తుంటే.. అలా తమ ఇంటికి ముందు చేయొద్దు అన్నందుకు వారిపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. మద్యంమత్తులో ఆ కుటుంబంపై దాడికి దిగాడు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కోపంతో తుపాకీతో కాల్పులకు దిగాడు. ఈ దారుణమైన ఘటనలో ఆ కుటుంబంలోని ఓ బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో వెలుగు చూసింది.

ఉత్తరప్రదేశ్లోని భింద్ జిల్లాలోని నయాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట్ గ్రామంలో.. వికాస్, పింటూశర్మ అనే వ్యక్తులు ఉంటున్నారు. పింటూ శర్మ నిత్యం వికాస్ ఇంటి ముందు మూత్ర విసర్జన చేసేవాడు. దీనిమీద వికాస్ అలా చేయద్దని అభ్యంతరం తెలిపాడు. అయినా పింటూ శర్మ వినలేదు. దీంతో మంగళవారం మరోసారి ఇదే విషయంపై  పింటూ శర్మ, వికాస్ ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పింటూ శర్మపై వికాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశాడు.

ఇది పింటూ శర్మకు నచ్చలేదు. తన మీదే ఫిర్యాదు చేస్తావా అంటూ.. వికాస్ పై కోపానికి వచ్చాడు. మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి వికాస్ ఇంటికి వెళ్ళాడు. తనతో తీసుకెళ్లిన తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో వికాస్ ఇంట్లో ఉన్న ముగ్గురు సభ్యులు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో ఉన్న 12 ఏళ్ల బాలుడు కాల్పులకు మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని.. వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితులు ఎవరో తెలియడంతో పింటూ శర్మతో పాటు అతడి అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ మేరకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. 

అయితే,  వికాస్ కుటుంబ సభ్యులు నయాగావ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. వారి వ్యవహారాన్ని నిరసిస్తూ.. రోడ్డుమీద ఆందోళనకు దిగారు. ఈ ఘటన జరగడానికి ముందు పింటూ శర్మ తమ ఇంటిముందు మూత్రవిసర్జన చేస్తున్న విషయంలో చాలా సార్లు ఫిర్యాదు చేశామని.. కానీ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే పింటూ శర్మ రెచ్చి పోయాడని.. ఈ ఘటనకు కారణం ముందుగా పట్టించుకోని పోలీసులు కూడా అని.. ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గొడవ పెద్దది కావడంతో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios