Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మృతి.. 30 మందికి గాయాలు

మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించారు. 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. 

Serious road accident in Maharashtra.. 2 killed as bus overturned. 30 injured
Author
First Published Jan 19, 2023, 12:39 PM IST

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధుదుర్గ్ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 30 మంది గాయాలు అయ్యాయి. రాష్ట్ర రాజధాని ముంబైకి 480 కిలో మీటర్ల దూరంలో ఉన్న కంకవ్లీలోని గాడ్ నది వంతెన సమీపంలోని ఓ మలుపు వద్ద డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. దీంతో బస్సు బోల్తా పడింది.

లఖింపూర్ ఖేరీ హింసాకాండ: సుప్రీం కోర్టులో కేంద్ర మంత్రి కుమారుడి బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన యూపీ సర్కార్

ఈ ఘటన ఉదయం 5.30 గంటలకు చోటు చేసుకుందని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదానికి గురైన లగ్జరీ బస్సు 36 మంది ప్రయాణికులతో పూణె నుంచి గోవా వెళ్తోందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కంకవ్లిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.

అది ఫేక్.. అసలు ఆమె మీద అత్యాచారమే జరగలేదు.. మెడికల్ రిపోర్టులో షాకింగ్ విషయాలు...

ముంబై-గోవా హైవేపై కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు 9 మంది మరణించారు. కారు, ట్రక్కు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో కారులో ఉన్న వారందరూ మరణించారు. అదే సమయంలో లారీలో కూర్చున్న వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios