గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను అంతమొందించడంలో కీలకంగా వ్యవహరించిన వ్యవహరించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు, మాజీ ఐపీఎస్ అధికారి కే విజయ్ కుమార్ తన  పదవీకి రాజీనామా చేశారు.వ్యక్తిగత కారణాల వల్ల పదవికి ఆయన రాజీనామా చేశారు.

గంధపు చెక్కల స్మగ్మర్ వీరప్పన్‌ను మట్టుబెట్టడంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు, మాజీ ఐపీఎస్ అధికారి కే విజయ్ కుమార్ తన పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లెటర్‌ను సంబంధిత అధికారులకు అందజేశారు. ఢిల్లీలో గల తన నివాసాన్ని ఖాళీ చేసి తమిళనాడుకు వెళ్లిపోయారు. ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆయన మాత్రం తన వ్యక్తిగత కారణాలతో తన బాధ్యతలకు రాజీనామా చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో తనకు అవకాశం కల్పించిన పీఎం నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, ఎంహెచ్ఏ అధికారులు, వివిధ రాష్ట్రాల పోలీసు బలగాల చీఫ్‌లకు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌తో పాటు వామపక్ష తీవ్రవాదం (LWE) సమస్యలపై ఆయన ఎక్కువగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు . ఆయన 1975-బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్‌గా 2012లో పదవీ విరమణ చేశారు. తర్వాత MHA క సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. 2019లో MHAలో సీనియర్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌గా మళ్లీ నియమితులయ్యే ముందు అతను జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌కు సలహాదారుగా పనిచేశాడు.

వీరప్పన్‌ను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చీఫ్‌గా పనిచేశారు. చెన్నై పోలీస్ కమిషనర్,కాశ్మీర్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను వేటాడే పనిలో ఉంది. విజయ్‌కుమార్ అమలు చేసిన ప్లాన్‌లో చిక్కుకుని వీరప్పన్ 2004లో చనిపోయాడు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఆ తర్వాత కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు హోం శాఖ అడ్వైజర్‌గా ఉన్నారు. కానీ ఆయన రాజీనామా సర్వత్రా చర్చనీయంగా మారింది.