Shiv Sena vs Eknath Shinde: శివసేనను ఎవరూ వదల్లేదు.. విచారణ రేపటికి వాయిదా
Shiv Sena vs Eknath Shinde: ఉద్ధవ్ శిబిరం తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు విడిపోవాలనుకుంటే ఎవరితోనైనా విలీనం చేయాలని లేదా కొత్త పార్టీని స్థాపించాలని అన్నారు. రాజకీయ పార్టీని ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని అన్నారు. తమకు మెజారిటీ ఉందని, అయితే 10వ షెడ్యూల్ ద్వారా మెజారిటీకి గుర్తింపు లేదని వాదిస్తున్నారు.
Shiv Sena vs Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. తొలుత పార్టీ తిరుగుబాటుకు నాయకత్వం వహించి.. సీఎం పీఠాన్ని దక్కించుకున్న షిండే.. తాజాగా.. తమదే అసలైన శివసేనననీ, పార్టీపై తమకే పూర్తి హక్కు ఉందనీ, ఏక్నాథ్ షిండే వర్గం పోరుకు దిగాడు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలు చీలిపోయింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నేడు ఇరు వర్గాల వాదోపదాలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా చేసింది. ఈ తరుణంలో వాదనల ముసాయిదాను మరోసారి సిద్ధం చేసి.. రేపు ఉదయం కోర్టులో సమర్పించాలని షిండే తరపు న్యాయవాది హరీశ్ సాల్వేను కోర్టు కోరింది.
నేటీ విచారణలో ఏం జరిగిందంటే..
షిండే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని విషయాలను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా.. కేసుకు సంబంధించిన చట్టపరమైన ప్రశ్నల సంకలనాన్ని అన్ని పార్టీలు సమర్పించారా? అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. దీనిపై గవర్నర్ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నానని తెలిపారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి విడిపోవాలనుకుంటే.. ఎవరితోనైనా విలీనం చేయాలని లేదా కొత్త పార్టీ పెట్టాలని ఉద్ధవ్ శిబిరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. సిబల్ ప్రశ్నకు సీజేఐ బదులిస్తూ.. తాను బీజేపీలో విలీనం కావాల్సింది లేదా ప్రత్యేక పార్టీ పెట్టాలని మీరు చెబుతున్నారని అన్నారు. షిండే వర్గం దీన్ని చట్టబద్ధంగా చేసి ఉండాల్సిందని సిబల్ అన్నారు.
పార్టీ అంటే కేవలం ఎమ్మెల్యేల వర్గం మాత్రమే కాదనని సిబల్ అన్నారు. ఇంతమందిని పార్టీ సమావేశానికి పిలిచారు. కానీ, షిండే రాలేదు. డిప్యూటీ స్పీకర్కు లేఖ రాశారని అన్నారు. నేటికీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక నిబంధన)ను రాజ్యాంగంలో చేర్చినప్పుడు, దానికి కొంత ప్రయోజనం ఉందని ఆయన అన్నారు. ఇలాంటి దుర్వినియోగానికి అనుమతిస్తే.. మెజారిటీ ఎమ్మెల్యేలు తప్పుడు మార్గంలో ప్రభుత్వాన్ని పడగొట్టి.. అధికారాన్ని చేబట్టే అధికారముంటుందని అన్నారు.
ఉద్ధవ్ గ్రూప్ కు చెందిన రెండవ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. షిండే వర్గం ఏదో ఒక పార్టీలో విలీనం కావాలి, కానీ అలా చేయలేదని అన్నారు. అసలు పార్టీ తానేనని, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని సింఘ్వీ అన్నారు.
షిండే వర్గం తరపు లాయర్ హరీష్ సాల్వే ఏమన్నారు?
మరోవైపు.. మాజీ సీఎం ఉద్దవ్ కు మెజారిటీ లేదని షిండే వర్గం తరపు న్యాయవాది హరీశ్ సాల్వే అన్నారు. శివసేనలోనే అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. సిబల్ చెప్పినదానికి సంబంధం లేదని అన్నారు. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది ఎవరు? పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు.. ఇతర వర్గాల సమావేశానికి హాజరు కాకపోవడం అనర్హత ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఈ వాదనలు విన్న సీజేఐ .. అలా చేస్తే పార్టీకి అర్థం ఉండదని అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎవరైనా ఏమైనా చేయగలరని అన్నారు.
దీనిపై సాల్వే స్పందిస్తూ.. ఒక నాయకుడిని పార్టీ మొత్తంగా పరిగణిస్తారనే భ్రమ మనకు ఉందన్నారు. షిండే వర్గం ఇంకా పార్టీలోనే ఉన్నామనీ. పార్టీని వీడలేదు. నాయకుడికి వ్యతిరేకంగా గళం విప్పారని, శివసేనను ఎవరూ వీడలేదనీ, పార్టీలో 2 వర్గాలు మాత్రమే చీలిందని పేర్కొన్నారు.
1969లో కాంగ్రెస్లో కూడా ఇలాగే జరిగిందనీ, ఇలా చాలా సార్లు జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హతతో దీన్ని ముడిపెట్టడం సరికాదన్నారు. ఏది ఏమైనా.. షిండేను ఎవరూ అనర్హులుగా ప్రకటించలేదని, అనర్హత ప్రశ్నే తలెత్తదని షిండే వర్గం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్లోర్ టెస్ట్ కూడా జరగలేదన్నారు.
జూలై 20న విచారణ జరిగింది
అంతకుముందు.. ఈ అంశంపై జూలై 20న విచారణ జరిగింది. దీనిపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయవచ్చు. అన్ని పక్షాలు తమలో తాము మాట్లాడుకోవాలని, విచారణ పాయింట్ల సంకలనాన్ని సమర్పించాలని కోర్టు కోరింది. ఇరు వర్గాల నేతల అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయని, ఈ పిటిషన్లలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం, గవర్నర్ తరపున షిండే వర్గానికి ఆహ్వానం, విశ్వాస పరీక్షలో శివసేన ఇద్దరు విప్ల జారీ వంటి అనేక అంశాలు ఉన్నాయి.