Asianet News TeluguAsianet News Telugu

జన గణనలో ఓబీసీ గణన.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు.. 

2018లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏబీసీ జనాభా గణనను ప్రకటించారని కృష్ణ కన్హయ్య పాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. 2021 జనాభా లెక్కల సమయంలో ఓబీసీ జనాభా గణన వివరాలను ప్రత్యేకంగా సేకరిస్తామని చెప్పారు.
 

SC Notice To Centre On Plea Seeking Caste-Based Census For OBC Supreme Court Update
Author
First Published Dec 25, 2022, 4:53 AM IST

సుప్రీంకోర్టు: రాబోయే జనాభా గణనలో ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) కుల ఆధారిత జనాభా గణనకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్రం స్పందన కోరుతూ నోటీసులు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఇదిలావుండగా..ఓబీసీల కోసం కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తదితరులకు నోటీసులు జారీ చేస్తూ ధర్మాసనం వివరణ  కోరింది. ఈ అంశంపై  ఇరు పక్షల వాదనలు విన్న ధర్మాసనం ఇదే అంశాన్ని మరో అంశంతో పాటుగా జాబితా చేసింది.

ఈ మేరకు న్యాయవాది కృష్ణ కన్హయ్య పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ లో కులాలవారీ సర్వే, కులాల వారీగా జనాభా గణన లేకపోవడం వల్ల ప్రభుత్వాలు వెనుకబడిన తరగతులకు చెందిన అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందజేయలేకపోతున్నాయన్నారు. ప్రధానంగా  OBC వారు ప్రభావితమతున్నారని చెప్పారు.  

దీనితో పాటు ఖచ్చితమైన డేటా లేనప్పుడు ఖచ్చితమైన విధానాలను రూపొందించలేమని ఆయన  తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే.. 2018లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏబీసీ జనాభా గణనను ప్రకటించారని కృష్ణ కన్హయ్య పాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2021 జనాభా లెక్కల సమయంలో ఓబీసీ జనాభా గణన వివరాలను ప్రత్యేకంగా సేకరిస్తామని చెప్పారు. ఇంత జరిగినా 2017లో రూపొందించిన రోహిణి కమిషన్‌ నివేదికను కేంద్ర ప్రభుత్వం సమర్పించలేదు.
 
 పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశం

కర్ణాటకలోని బీదర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో గాయపడిన మహిళా కార్మికురాలికి రూ.9.30 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బాధితురాలి పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం, తీవ్రమైన ప్రమాదం తర్వాత బాధితుడు అనుభవించే బాధను ఎంత నగదు లేదా ఇతర వస్తు పరిహారం అయినా ఇవ్వాలని పేర్కొంది. ఆర్థిక పరిహారం పరిహారం మాత్రమే హామీ ఇస్తుంది. అంగవైకల్యాన్ని పరిగణనలోకి తీసుకుని బాధితులకు తగిన పరిహారం అందించాలని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios