మోడీ బయోపిక్పై కేసు: విచారణకు స్వీకరించిన సుప్రీం
ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘‘పీఎం నరేంద్రమోడీ’’ సినిమాపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘‘పీఎం నరేంద్రమోడీ’’ సినిమాపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ సినిమాలో మోడీ గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందటం వరకు అన్ని కోణాలను చూపాయనేది కాంగ్రెస్ వాదన.
ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని చూసి ఓటర్లు ప్రభావితం కావచ్చనే ఉద్దేశ్యంతో విపక్ష పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయటం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందంటూ ఆరోపించాయి.
మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అమన్ పన్వార్ ఈ చిత్ర విడుదలను ఆపాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
కాగా, పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఎన్నికల సంఘానికి తెలిపింది. కానీ ఈ సినిమా విడుదలకు తామెప్పుడూ మద్ధతుగానే ఉంటామని చెప్పుకొచ్చింది.
ఇందులో ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధించిన సన్నివేశాలేవి లేవని చెప్పింది. వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.