Sabha Elections 2024 : 2024 లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య రూపొందించిన క్యారికేచర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో తీవ్ర దుమారం రేపుతోంది. సంబంధిత కార్టూన్ లో శ్రీరాముడు, నరేంద్ర మోడీ, దేవాలయం చిత్రాలు ఉన్నాయి.
Sabha Elections 2024 : 2024 లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య రూపొందించిన క్యారికేచర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో, ముఖ్యంగా ఎక్స్ లో తీవ్ర దుమారం రేపింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆలయం లోపలి నుంచి 'ఆప్ కౌన్' అని రాముడిని అడుగుతున్నట్లు ఈ క్యారికేచర్ లో ఉంది. క్రమంలోనే కార్టూనిస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్యారికేచర్ తీవ్ర వివాదానికి దారితీసింది.. సతీష్ ఆచార్య తన క్యారికేచర్ తో శ్రీరాముడు, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరినీహేళనతో అవమానిస్తున్నాడంటూ చాలా మంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్టూనిస్ట్ ఆ కళాఖండాన్ని సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించాలనీ, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. మరికొందరు సతీష్ ఆచార్యను పోలీసు అధికారులు అరెస్టు చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు చేస్తున్నారు.
దేశంలో ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 6 దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరగనుంది. 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కొందరు వ్యక్తులు హోం మంత్రి అమిత్ షాకు, భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
25 కోట్లు వర్త్ వర్మ.. వర్త్.. ఐపీఎల్లో బెస్ట్ బాల్ ఇదే.. వీడియో
ప్రధాని మోడీ మూడోసారి అధికారంలోకి రావడంపై ఆశాభావం వ్యక్తం చేసిన రెండు రోజులకే ఆచార్య కార్టూన్ బయటకు వచ్చింది, తనకు ఒక దైవిక లక్ష్యం ఉందని తన నమ్మకాన్ని ధృవీకరించారు. ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కొనసాగుతానని ప్రతిజ్ఞ చేశారు. తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యమని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ అన్నారు. "మీరు (నా కోసం) నీచమైన దూషణలను ఉపయోగించే వ్యక్తులను చూస్తారు. మంచి విషయాలు చెప్పే వ్యక్తులను కూడా చూస్తారు. ప్రజలు విశ్వాసం దెబ్బతినకుండా, వారు నిరాశ చెందకుండా చూడటమే తన కర్తవ్యమ"న్నారు.
"కొంతమంది నన్ను వెర్రి అని పిలుస్తారు, కానీ దేవుడు నన్ను ఒక ప్రయోజనం కోసం పంపాడని నాకు పూర్తి నమ్మకం ఉంది. లక్ష్యం నెరవేరిన తర్వాత నా పని కూడా పూర్తవుతుంది. అందుకే నన్ను నేను పూర్తిగా దేవుడికి అంకితం చేసుకున్నానని" కూడా మోడీ పేర్కొన్నారు.
SHREYAS IYER : రోహిత్ శర్మ తర్వాత రెండో ప్లేయర్గా శ్రేయాస్ అయ్యర్ సరికొత్త రికార్డు..