Asianet News TeluguAsianet News Telugu

రూ.50 కోట్లిస్తే మోడీని చంపుతా: మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్

 రూ. 50 కోట్లిస్తే తాను ప్రధానమంత్రిని హత్య చేస్తానని బీఎస్‌ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ చేసిన వ్యాఖ్యానించినట్టుగా ఓ వీడియోను బీజేపీ నేతలు బయటపెట్టారు. 

Rs 50 crore to kill Modi: BJP expresses shock, ex-BSF man says clip doctored
Author
New Delhi, First Published May 7, 2019, 12:16 PM IST

న్యూఢిల్లీ: రూ. 50 కోట్లిస్తే తాను ప్రధానమంత్రిని హత్య చేస్తానని బీఎస్‌ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ చేసిన వ్యాఖ్యానించినట్టుగా ఓ వీడియోను బీజేపీ నేతలు బయటపెట్టారు. 

సోమవారం నాడు బీజేపీ నేతలు ఈ వీడియోను మీడియాకు విడుదల చేశారు.  వారణాసి ఎంపీ స్థానం నుండి ఎస్పీ అభ్యర్ధిగా తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని తానేనని ఆయన ఒప్పుకొన్నాడు. కానీ, ప్రధానమంత్రిని రూ. 50 కోట్లిస్తే చంపుతానని తాను ఏనాడూ అనలేదన్నారు. ఈ వీడియోను 2017లో న్యూఢిల్లీలో తాను ధర్నా చేసే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ చిత్రీకరించాడన్నారు. తనను బీఎస్‌ఎఫ్ నుండి  డిస్మిస్ చేసిన  సమయంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ఆ సమయంలో తాను అనేక సమస్యల గురించి మాట్లాడినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.  కానీ, ఏనాడూ కూడ ప్రధానిని హత్య చేస్తానని చెప్పలేదన్నారు.
ఈ వీడియోను చిత్రీకరించిన కానిస్టేబుల్ తనను రెండు వారాల క్రితం కలిసినట్టుగా చెప్పారు.

 ఆర్థిక అవకతవకలకు పాల్పడే ఓ వ్యవహారంలో తనతో కలిసి పనిచేయాలని కోరితే తాను తిరస్కరించినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఆ సమయంలో తన వీడియోను చూపి ఈ వీడియోను సర్కులేట్ చేస్తానని బెదిరించాడని  తేజ్ బహదూర్ చెప్పారు. అంతేకాదు తనను రూ. 50 లక్షలు ఇవ్వాలని కూడ డిమాండ్ చేశాడని ఆయన చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios