Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా: కేంద్ర మంత్రి

కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం ₹ 50,000 ఎక్స్‌గ్రేషియా అందజేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. 

Rs 50,000 Aid Given To Family Of Those Who Died Of Covid: Union Minister
Author
First Published Dec 7, 2022, 5:53 PM IST

కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో తెలిపారు. విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డిఎంఎ) జారీ చేసిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి కోవిడ్-19 బాధితులకు ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ఇస్తున్నట్లు ఒక లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

సహాయక చర్యలు లేదా సన్నాహక కార్యకలాపాలలో పాల్గొన్న వారితో సహా మరణించిన వారి తదుపరి బంధువులకు సహాయం అందించబడుతుందని ఆయన అన్నారు. మరణానికి కారణం కోవిడ్‌గా ధృవీకరించబడిన తర్వాత రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుండి సహాయం అందించబడుతుందని తెలిపారు. కోవిడ్-19 డెత్' ఆరోగ్య మంత్రిత్వ శాఖ , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంయుక్తంగా జారీ చేసాయి. కోవిడ్ సమయంలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను తగ్గించడానికి కేంద్రం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 

ఆహార భద్రతపై మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి మార్చి 2020లో అదనపు ఉచిత ఆహార ధాన్యాలు (బియ్యం / గోధుమ) పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాయ్ చెప్పారు.  జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) అంత్యోదయ అన్న యోజన (AAY), ప్రాధాన్యత గల గృహ (PHH) లబ్దిదారులకు ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందించబడ్డాయని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios