Asianet News TeluguAsianet News Telugu

ఈడీ ఎదుట తల్లితో కలిసి హాజరైన రాబర్ట్ వాద్రా

బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.

Robert Vadra, mother appear before ED in Jaipur in land scam probe
Author
New Delhi, First Published Feb 12, 2019, 12:36 PM IST


న్యూఢిల్లీ: బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.

బికనీర్ భూ కుంభకోణం విషయమై విచారణకు హాజరుకావాలని వాద్రాకు ఇప్పటికే ఈడీ మూడు దఫాలు  నోటీసులు పంపింది. కానీ,  ఇంతవరకు  ఆయన విచారణకు హాజరుకాలేదు.కానీ, ఈ కేసులో తల్లితో కలిసి వాద్రా ఇవాళ  ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.  

బికనీర్ భూ కుంభకోణంపై 2015లో ఈడీ కేసు నమోదు చేసింది. బికనీర్ తహాసీల్దార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ భూమిని కేటాయించారని  ఆయన ఫిర్యాదు చేశారు.  రాబర్ట్ వాద్రాతో ఈడీ ముందు హాజరుకావడంతో ప్రియాంక గాంధీ కూడ లక్నో నుండి రాజస్తాన్‌కు బయలుదేరారు.

Follow Us:
Download App:
  • android
  • ios