తమిళనాడులో దుండగులు సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. మధురై తిరునగర్‌లో గురువారం అర్థరాత్రి హైవేకు రోడ్డుకు అడ్డంగా దుండగులు బండలు పెట్టారు.

తమిళనాడులో దుండగులు సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. మధురై తిరునగర్‌లో గురువారం అర్థరాత్రి హైవేకు రోడ్డుకు అడ్డంగా దుండగులు బండలు పెట్టారు. చీకటితో పాటు పాటు వేగంగా వస్తుండటంతో ఓ వాహనదారుడికి బండలు కనిపించకపోవడంతో వారి వాహనం వాటిని ఢీకొట్టింది. దీంతో వాహనదారుడు కిందపడిపోయాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ వెంటనే అతని బ్యాగులో ఉన్న నగదుతో సహా దుండగుడు ఊడాయించాడు. తొలుత అందరూ దీనిని యాక్సిడెంట్‌గా భావించారు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.