ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బస్సు లోయలో పడిన ఘటనలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. చమోలి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలి దగ్గర 700 మీటర్ల లోతైన లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలుతెలియాల్సి వుంది.