ఉత్తరాఖండ్లో లోయలో పడ్డ బస్సు.. 13 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీ జిల్లాలో వ్యాను లోయలో పడటంతో 13 మంది మరణించారు. బట్వాడీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీ జిల్లాలో వ్యాను లోయలో పడటంతో 13 మంది మరణించారు. బట్వాడీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. కేవలం ఇద్దరు మహిళలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారి వివరాలు.. ఇతర సమాచారం అందాల్సి ఉంది.