Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ బస్సుని ఢీకొట్టిన ట్రక్కు..ఏడుగురు మృతి

ఈ సమయంలో అదుపు తప్పి వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. 

road accident in UP..7 dead, 2 injured
Author
Hyderabad, First Published Oct 2, 2018, 4:36 PM IST

ఆర్టీసీ బస్సుని ఓ ట్రక్కు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగిందీ ఘటన. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు అలహాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తుండగా భాదోహీ గ్రామం సమీపంలోని చావనీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక సమస్య వల్ల బస్సు ఆగిపోగా, కొందరు ప్రయాణికులు కిందికి దిగి తోస్తున్నారు. ఈ సమయంలో అదుపు తప్పి వేగంగా వచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios