Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి, 60 మందికి గాయాలు...

అతివేగంతో ఎదురెదురుగా వచ్చిన రెండు బస్సులు ప్రమాదానికి కారణం అయ్యాయని బస్సుల్లోని ప్రయాణికులు అంటున్నారు. 

road accident in Tamil Nadu, 4 dead, 60 injured - bsb
Author
First Published Nov 11, 2023, 7:39 AM IST

తమిళనాడు : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొట్టుకోవడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 60 మందికి గాయాలయ్యాయి. తిరువత్తూర్ జిల్లా దగ్గర వానియంబడి హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమాచారం తెలియడంతో వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని బస్సుల్లోని ప్రయాణికులు అంటున్నారు.

చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రాష్ట్ర ప్రభుత్వ బస్సు, ఓమ్నిబస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 60 మంది ప్రయాణికులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రెండు వాహనాల ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు పది అంబులెన్స్‌లలో క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చడంలో సహాయపడ్డారని ఓ అధికారి తెలిపారు.

బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్న స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఇక్కడికి సమీపంలోని చెట్టియప్పనూర్ వద్ద చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న ఓమ్నిబస్సును ఢీకొనడంతో ఒక మహిళతో సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు. గుడువంచెరికి చెందిన రితిక (32), వాణియంబాడికి చెందిన మహ్మద్ ఫిరోజ్ (37), ఎస్‌ఈటీసీ బస్సు డ్రైవర్ కె ఎలుమలై (47), చిత్తూరుకు చెందిన బి అజిత్ (25) అక్కడికక్కడే మృతి చెందగా, ఓమ్నిబస్ డ్రైవర్ ఎన్ సయ్యద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఉదయం 4 గంటలకు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి ప్రభుత్వాసుపత్రిలో, వేలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios