మరో పంజాబీ సింగర్ పై హత్యాయత్నం.. రాపర్ హనీ సింగ్ భావోద్వేగ పోస్టు.. !
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత తాజాగా మరో పంజాబీ సింగర్పై దాడి వార్త తెరపైకి వచ్చింది. గాయకుడు అల్ఫాజ్పై జరిగిన ఘోరమైన దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని రాపర్ హనీ సింగ్ తన ఫోటోను షేర్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది.
పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్యకు గురై 4 నెలలు తరువాత మరో దారుణం జరిగింది. తాజాగా మరో గాయకుడిపై హత్యాయత్నం జరిగిందనే వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సింగర్ ఆల్ఫాస్పై దారుణమైన దాడి జరిగింది. ఆయన నటుడు, మోడల్, రచయిత కూడా. ప్రముఖ రాపర్ హనీ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడం ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పోస్టులోని చిత్రంలో అల్ఫాజ్ ఆసుపత్రి బెడ్పై కనిపిస్తాడు. అతడి తలకు బలమైన గాయమైంది. అతని చేతిపై కూడా గాయం గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గాయకుడు అల్ఫాజ్పై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతను ఆసుపత్రిలో చేరాడు. అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరనే దానిపై ఎలాంటి సమాచారం తెలియరాలేదు. గాయకుడు అల్ఫాజ్ చిత్రాన్ని పంచుకుంటూ సింగర్ హనీ సింగ్ ఇలా రాసుకోచ్చారు. "నిన్న రాత్రి నా సోదరుడు అల్ఫాజ్పై ఎవరో దాడి చేశారు. ఎవరైతే ఈ ప్లాన్ వేసారో, నేను వారిని వదిలిపెట్టను, దయచేసి అతని కోసం ప్రార్థించండి. అని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అతను కొత్త పోస్ట్ చేసాడు, అందులో అతను మొహాలీ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ సింగర్ ఆల్ఫాస్ ప్రమాదం నుండి బయటపడినట్లు తెలియజేసాడు. సింగర్ అల్ఫాజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు.
వాస్తవానికి, గాయకుడు అమంజోత్ సింగ్ పన్వార్ అలియాస్ అల్ఫాజ్ను పికప్ టెంపోతో కొట్టినందుకు రాయ్పూర్ రాణి నివాసి విక్కీపై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. సోహనా పోలీస్ స్టేషన్లో ఐపీసీ 279, 337, 338 సెక్షన్ల కింద పోలీసులు విక్కీపై కేసు నమోదు చేశారు. గాయకుడు అల్ఫాజ్ తన ముగ్గురు స్నేహితులు గుర్ప్రీత్, తేజీ మరియు కుల్జీత్లతో కలిసి రాత్రి భోజనం చేసి పాల్ ధాబా నుండి బయటకు వస్తుండగా, విక్కీ మరియు ధాబా యజమాని మధ్య గొడవ జరిగిందని వర్గాలు తెలిపాయి. విక్కీ తనకు సహాయం చేయమని అల్ఫాజ్ని అభ్యర్థిస్తాడు, కానీ యజమాని తన డబ్బు చెల్లించకపోవడాన్ని చూసి, అతను దాబా యజమాని యొక్క టెంపోతో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. పరిగెత్తుతుండగా అల్ఫాజ్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచాడు.
మే 29న సిద్ధూ ముసేవాలా హత్య
దీనికి ముందు.. మే 29న మాన్సా జిల్లాలో గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధు ముసేవాలా కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఆరవ మరియు చివరి షూటర్ను పంజాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గత నెలలో మాన్సా కోర్టులో దాఖలు చేసిన 1,850 పేజీల ఛార్జిషీట్లో.. కరుడుగట్టిన నేరస్థుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు ప్రధాన కుట్రదారుడని, జగ్గు భగవాన్పురియా, లారెన్స్ బిష్ణోయ్, ఇతరులతో కలిసి ఈ సంఘటనకు పాల్పడ్డాడని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు.
సిద్ధూ ముసేవాలా హత్య కేసులో పంజాబ్ పోలీసులు, కేంద్ర సంస్థలతో కలిసి ఇప్పటివరకు 23 మందిని అరెస్టు చేశారు. మూసేవాలాపై కాల్పులు జరిపిన ఆరుగురు షార్ప్ షూటర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీటన్నింటిని ఈ కేసులో ప్రశ్నిస్తున్నారు.