early monsoons in 2022:  ఈ ఏడాది రుతుపవనాలు ఒక వారం ముందుగానే వస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. అలాగే, సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయంటూ చల్లని కబురును చెప్పింది.  

heatwave: గత కొన్ని వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలుల తీవ్రత పెరింగింది. ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ఎండ‌ల తీవ్ర‌త‌కు ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. దేశ రాజ‌ధాని లో ఎండ‌ల ప్ర‌భావం మ‌రింత‌గా పెరుగుతుంద‌నే నేప‌థ్యంలో ఎల్లో అలర్టు కూడా ప్ర‌క‌టించారు. ఇలాంటి నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ విభాగం చ‌ల్ల‌ని క‌బురును చెప్పింది. దేశంలో అతి త్వ‌ర‌లో మండుతున్న ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని పేర్కొంది. ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గ‌నున్నాయ‌ని తెలిపింది. దీనికి కార‌ణం నైరుతి రుతుప‌వ‌నాలు.. ! ఎందుకంటే ఈ సారి భార‌త్ ను రుతుప‌వ‌నాలు మందుగానే తాక‌నున్నాయ‌ని ఐఎండీ పేర్కొంది. 

భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నాలకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. IMD తాజా అంచనా ప్రకారం వేడిగాలులు త్వరలో తగ్గిపోవచ్చని సూచిస్తున్నాయి. రుతువ‌ప‌నాలు ముందుగానే ప్ర‌వేశించ‌నున్నాయి. ప్రతియేటా జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తుంటాయి. ఈసారి మాత్రం కాస్త త్వరగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ అంచ‌నా వేసింది. ముందుగా అంటే మే నెలాఖరులోగా ప్రవేశించవచ్చని అంచనా. ముందుగా అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి..అక్కడ్నించి కేరళ, ఇతర ప్రాంతాల్లో ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. అండమాన్ మరియు నికోబార్ దీవులు మే 15న సంవత్సరంలో మొదటి కాలానుగుణ జల్లులను అందుకుంటాయని భావిస్తున్నందున.. రుతుపవనాలు ఈ ఏడాదిలో దేశంలోకి ముందుగానే వస్తాయని అంచనా వేసింది. వ‌ర్షాలు సాధారణం కంటే అధికంగానే కురుస్తాయ‌ని తెలిపింది. 

2022 మే 15 నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం & దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD తన అధికారిక అంచనాలో పేర్కొంది. ప్ర‌స్తుతం దేశ‌రాజ‌ధాని ఢిల్లీ స‌హా అనేక ఇతర రాష్ట్రాలు హీట్‌వేవ్‌లో కొట్టుమిట్టాడుతున్న క్ర‌మంలో ఐఎండీ నుంచి ఈ ప్ర‌క‌ట‌న రావ‌డం ఊర‌ట క‌లిగిస్తోంది. IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. “సాధారణంగా, రుతుపవనాలు మే 15న నికోబార్ దీవుల మీదుగా పురోగమిస్తాయి మరియు మే 22 నాటికి అండమాన్ దీవుల్లోని ఉత్తర బిందువు అయిన మాయాబందర్‌ను కవర్ చేస్తాయి” అని తెలిపారు. అండమాన్ మరియు నికోబార్ దీవులలో మొత్తం ఐదు రోజుల పాటు వర్షాలు మరియు ఈదురు గాలులు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే రాబోయే ఐదు రోజుల్లో కేరళ-మహే మరియు లక్షదీప్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ ట్విట్టర్‌లో.. “భారత వాతావరణ శాఖ పొడిగించిన శ్రేణి అంచనాలు కేరళపై రుతుపవనాల ప్రారంభానికి మరియు ఉత్తరం వైపు కదలికకు అనుకూలమైన పరిస్థితులను స్థిరంగా సూచించాయి” అని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రుతుపవనాలు దేశాన్ని తాకుతాయని భావిస్తున్నప్పటికీ, భారతదేశంలోని దాదాపు 29 నగరాలు ప్రస్తుతం హీట్‌వేవ్ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గురువారం చాలా నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకగా, రాజస్థాన్‌లోని కొన్ని నగరాల్లో ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో గురువారం 44 నుండి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో హీట్‌వేవ్ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శుక్ర, శనివారాల్లో హీట్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేయగా, ఆదివారం తీవ్రమైన హీట్‌వేవ్ గురించి ప్రజలను హెచ్చరించడానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.